సత్యాగ్రహ పాదయాత్ర : చంద్రబాబుపై మరో పోరుకు సిద్దమైన ముద్రగడ
కిర్లంపూడి : తుని సభ.. అటు తర్వాత ఆమరణ నిరాహార దీక్ష ద్వారా కాపు ఉద్యమ సెగను ప్రభుత్వానికి తగిలేలా చేసిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి ప్రభుత్వంపై పోరుకు సిద్దమవుతున్నారు. ఈ దఫా సత్యాగ్రహ పాదయాత్ర ద్వారా తమ నిరసనను వ్యక్తం చేయాలని నిర్ణయించుకున్నారు ముద్రగడ.
ఈ మేరకు నవంబర్ 16నుంచి ఐదురోజుల పాటు పాదయాత్ర చేయనున్నట్లు ముద్రగడ ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఆయన స్వగ్రామం కిర్లంపూడిలో ఈ విషయాన్ని మీడియాతో తెలిపారు. కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పి ఇప్పటికీ నాన్చుడు ధోరణితోనే వ్యవహరిస్తోన్న సీఎం చంద్రబాబు తీరుకు నిరసనగా ఈ పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారాయన.

అగస్టు లోగా కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు.. ఇచ్చిన మాట తప్పారని ఈ సందర్బంగా ముద్రగడ మండిపడ్డారు. కాగా, పాదయాత్రలో భాగంగా.. రావులపాలెం నుంచి మొదలయ్యే సత్యాగ్రహ యాత్ర ఐదోరోజు అంతర్వేదిలో ముగుస్తుందని ముద్రగడ తెలియజేశారు. సీఎం చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ.. పాదయాత్రలో నల్లరిబ్బన్లు ధరిస్తామని చెప్పుకొచ్చారు.
మొత్తానికి ముద్రగడ తాజా నిర్ణయం ద్వారా మరోసారి రాష్ట్రంలో కాపు ఉద్యమం రగలనుంది. మరి ఎన్నికల్లో ఇచ్చిన హామిని నిలబెట్టుకోవడంలో ఇప్పటికే జాప్యం చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికైనా కాపుల పట్ల ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
-
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట!












Click it and Unblock the Notifications