బాబుతో ముగ్గురు మంత్రులు: టిడిపిలో చేరికపై చర్చ
హైదరాబాద్: ముగ్గురు రాష్ట్ర మంత్రులు, విశాఖపట్నం జిల్లాకు చెందిన నలుగురు కాంగ్రెసు శాసనసభ్యులు గురువారంనాడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. వారు చంద్రబాబును కలిసి తెలుగుదేశం పార్టీలో చేరికపై చర్చించినట్లు సమాచారం. మంత్రులు టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి, గంటా శ్రీనివాస రావు చంద్రబాబును కలిశారు.
విశాఖపట్నం జిల్లాకు చెందిన రమేష్ బాబు (పెందుర్తి), కన్నబాబు (ఎలమంచిలి), అవంతి శ్రీనివాస్ (భిమిలీ), చింతలపూడి వెంకట్రామయ్య (గాజువాక) చంద్రబాబు నాయుడిని కలిశారు. గంటా శ్రీనివాస రావుతో పాటు ఈ నలుగురు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధపడినట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి.

రాష్ట్ర విభజనతో అసంతృప్తికి గురైన మంత్రులు టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాప రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలే చేరుతారంటూ కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. కర్నూలు జిల్లాకు చెందిన ఈ ఇద్దరు మంత్రులు కూడా రాష్ట్ర విభజనపై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. అయితే, మొదటి నుంచి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అండగా నిలిచారు.
మరికొంత మంది కాంగ్రెసు శాసనసభ్యులు, నాయకులు తెలుగుదేశం పార్టీలోకి వస్తారనే ప్రచారం సాగుతోంది. సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ పుంజుకుంటున్న సూచనలు కూడా కనిపిస్తున్నాయని చెబుతున్నారు.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన












Click it and Unblock the Notifications