times now survey: ఏపీ, తెలంగాణలో జగన్, కేసీఆర్ పార్టీలదే హవా, ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లంటే?
న్యూఢిల్లీ: ప్రముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ(Times now) 2024లో జరగనున్న లోక్సభ ఎన్నికలపై సర్వే నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలకు వచ్చే లోక్సభ స్థానాలను అంచనా వేసింది. అయితే, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలకే అత్యధిక స్థానాలు రావడం గమనార్హం. ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలను దక్కించుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే వైయస్సార్సీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని టైమ్స్ నౌ తెలిపింది. వైయస్సార్సీపీకి వచ్చే లోక్సభ ఎన్నికల్లో 24 నుంచి 25 సీట్లు వస్తాయని పేర్కొంది. ఇక ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశంకు 0-1 ఎంపీ స్థానం దక్కే అవకాశం ఉందని తేల్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా విజయం సాధించినట్లేనని తెలుస్తోంది. ఏపీలో మొత్తం 25 ఎంపీ స్థానాలున్న విషయం తెలిసిందే.

కాగా, వైయస్సార్సీపీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. లోక్సభ ఎన్నికల్లోనే కాదు, వచ్చే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైయస్సార్సీపీ మెజార్టీ స్థానాలు దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోసారి ఏపీ ప్రజలు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిపిస్తారని స్పష్టం చేస్తున్నారు.
Times Now-@ETG_Research Survey
— TIMES NOW (@TimesNow) October 2, 2023
Lok Sabha 2024 | Telangana: Total Seats: 17
Seat Share:
- BRS: 9-11
- NDA: 2-3
- I.N.D.I.A: 3-4
- Others: 0-1
Watch @TheNewshour with @NavikaKumar pic.twitter.com/jPfIhT5pM7
తెలంగాణలో కేసీఆర్ బీఆర్ఎస్ జోరు
Times Now-@ETG_Research Survey
— TIMES NOW (@TimesNow) October 2, 2023
Lok Sabha 2024 | Andhra Pradesh: Total Seats: 25
Seat Share:
- YSRCP: 24-25
- TDP: 0-1
- JSP: 0
- NDA: 0
- Others: 0
TDP has to re-invent itself: @ashutosh83B
Jagan Mohan Reddy is delivering his promises: @AbbayaChowdary tells @padmajajoshi pic.twitter.com/Eg6JSYXg8G
తెలంగాణ రాష్ట్రంలోనూ అధికార పార్టీకే అత్యధిక స్థానాలు వస్తాయని టైమ్స్ నౌ సర్వే తేల్చింది. తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీకి 9 నుంచి 11 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని టౌమ్స్ నౌ సర్వే పేర్కొంది. ఇక బీజేపీకి రెండు నుంచి మూడు సీట్లు వచ్చే అవకాశం ఉందని.. కాంగ్రెస్ పార్టీ 3-4 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇతరులకు ఒక సీటు లభిస్తుందని తెలిపింది. గత నెల (సెప్టెంబర్)లో నిర్వహించిన సర్వే ఫలితాలను టైమ్స్ నౌ తాజాగా వెల్లడించింది. కాగా, తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలున్న విషయం తెలిసిందే.
-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!!












Click it and Unblock the Notifications