శ్రీవారి లడ్డూ కల్తీపై నమో వెంటేశాయ అంటూ నారా లోకేష్
Tirumala Laddu row: ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై నెలకొన్న వివాదం మలుపులు తిరుగుతోంది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు, చేపనూనెలను వాడారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు- గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో వాస్తవాలేమిటనేది వెలుగులోకి వస్తోన్నాయి.
ఈ వ్యవహారంపై ఆరోపణలను ఎదుర్కొంటోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. సీబీఐ విచారణ కోసం డిమాండ్ చేస్తోన్నారు. అప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయంటూ తేల్చి చెబుతున్నారు. తాము ఎలాంటి తప్పూ చేయలేదని, అలాంటప్పుడు దేనికీ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తోన్నారు. ఇందులో నిజనిజాలేమిటో బయటపెట్టడానికి సుప్రీంకోర్టు ప్రత్యేకంగా ఓ ఇండిపెండెంట్ సిట్ ను నియమించింది.

తిరుపతి లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును ఉపయోగించారన్న ఆరోపణలపై సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు ఇదివరకే కొట్టివేసింది. గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ అధ్యక్షుడు, ప్రజా శాంతి పార్టీ కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్ ను తోసిపుచ్చింది. దీనిపై సీబీఐ దర్యాప్తు అక్కర్లేదని వ్యాఖ్యానించింది.
తాజాగా తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం నిజాన్ని బయటపెట్టిందని అన్నారు. దోషులు చట్ట ప్రకారం చర్యలను ఎదుర్కొంటారని తేల్చి చెప్పారు. ఇది కల్తీ మాత్రమే కాదని, కోట్లాదిమంది హిందువుల విశ్వాసంపై ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. మన విశ్వాసాన్ని అపవిత్రం, దేశ ఆత్మపై దాడి చేయడంతో సమానమని వ్యాఖ్యానించారు. పవిత్రతతో ఆటలాడిన వారు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఓం నమో వెంకటేశాయ.. అంటూ తన ట్వీట్ ను ముగించారు.
The Supreme Court‑appointed SIT has exposed the truth. The guilty will face the full weight of the law. This isn’t adulteration - it is a deliberate assault on the faith of Hindus, a desecration of our belief, and a crime against the soul of Bharat. Those who played with the… https://t.co/ioSnLVNN6q
— Lokesh Nara (@naralokesh) November 10, 2025
-
తిరుమలలో శ్రీవారి సేవలు మూడురోజుల పాటు రద్దు -
85,000 శ్రీవారి లడ్డూలు సిద్ధం -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications