తిరుపతి లడ్డూ వివాదం.. జగన్ పై కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు!
తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూల తయారీకి జంతువుల కొవ్వు ఉపయోగించారన్న విషయం తాజాగా వెలుగులోకి రావడం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో అత్యంత పవిత్రంగా భావించే స్వామివారి లడ్డు అపవిత్రమైందని సాక్షాత్తు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన సంచలన వ్యాఖ్యలతో దుమారం మొదలైంది.
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పైన కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తిరుమలలో ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు చెప్పడం దీనికి సంబంధించి లాబ్ రిపోర్టులు కూడా వెలుగులోకి రావడంతో ఇది హిందువులను హిందూ ధర్మాన్ని కించపరచటమేనని వైయస్ జగన్ టార్గెట్ గా తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పైన కేంద్ర హోం శాఖకు ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు.

హిందువుల ఆత్మను హత్య చేశారని జగన్ పై ఆగ్రహం
వైయస్ జగన్మోహన్ రెడ్డి హిందువుల ఆత్మను హత్య చేశారని, హిందువుల మనోభావాలు దెబ్బ తీశారని ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ మండిపడుతూ కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేశారు.హిందువుల నమ్మకాలను, విశ్వాసాలను, ఆలయ పవిత్రతను ఘోరంగా దెబ్బతీశారని, ఉద్దేశపూర్వకంగానే ఇటువంటి చర్యలకు పాల్పడ్డారని జగన్ మోహన్ రెడ్డి పైన సంచలన ఆరోపణలు చేశారు.
కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకొని జగన్ మోహన్ రెడ్డి పైన కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖకు చేసిన ఫిర్యాదులో వినీత్ జిందాల్ పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ తో పాటు ఏపీ, ఉత్తరప్రదేశ్, డిజిపి లకు కూడా ఈ వ్యవహారం పైన న్యాయవాది ఫిర్యాదు చేశారు.
ఈ సెక్షన్ల క్రింద కేసులు పెట్టాలని డిమాండ్
గత సీఎం జగన్మోహన్ రెడ్డి తో పాటు అప్పటి టీటీడీ పాలకవర్గం, జంతువుల కొవ్వు నెయ్యిని సరఫరా చేసిన కాంట్రాక్టర్ల పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు. అంతే కాదు జగన్ తో పాటుగా ఇందుకు కారకులైన వారిపైన భారత న్యాయ సంహిత లోని సెక్షన్ 152 ,192,196,298, 353 సెక్షన్ల కింద వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని న్యాయవాది వినీత్ జిందాల్ డిమాండ్ చేశారు
జగన్ పై ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా?
జాతీయ భద్రతా చట్టం ప్రకారం జగన్మోహన్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరి దేశ వ్యాప్తంగా ఈ వ్యవహారం హిందువులకు ఆగ్రహం తెప్పిస్తున్న వేళ ఏపీ ప్రభుత్వం ఈ వ్యవహారంలో ఏ విధంగా స్పందిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.
-
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
రూ.300 టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శనం- భక్తుల కోసం టీటీడీ కొత్త విధానం...!! -
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications