Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టవర్ డిజైన్ కే మెజారిటీ ఓటు.. అమరావతిలో నిర్మించనున్న అసెంబ్లీ బిల్డింగ్ మోడల్ ఇదే....

Recommended Video

    Tower Design Finalized : టవర్ డిజైన్ కే మెజారిటీ ఓటు.

    అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనానికి డిజైన్ ను ఫైనల్ చేశారు. మెజారిటీ ప్రజల నిర్ణయం మేరకే ఆ మోడల్ ను ఖరారు చేశారు. ఆ డిజైన్ ఏమిటంటే...టవర్ ఆకృతి

    ఎపి రాజధాని అమరావతిలో నిర్మించనున్న అసెంబ్లీ భవనానికి టవర్ ఆకృతి ఫైనల్ అయిపోయింది. నార్మన్ ఫోస్టర్ సంస్థ సూచించిన రెండు డిజైన్ల లో ఈ టవర్ మోడల్ కే మెజారిటీ ప్రజలు మొగ్గుచూపారట. ఈరోజు జరిగే కేబినెట్ మీటింగ్ లో ఈ టవర్ డిజైన్ పై చర్చించిన అనంతరం దీని నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.

    సిఎం డిజైన్ల పరిశీలన...

    సిఎం డిజైన్ల పరిశీలన...

    ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ భవనానికి నార్మన్ ఫోస్టర్ సంస్థ ఇచ్చిన వివిధ డిజైన్లలో మెజారిటి ప్రజలు ఈ టవర్ డిజైన్ కే ఓటేసినట్లు ప్రభుత్వం తెలిపింది. శుక్రవారం విజయవాడలోని ఓ హోటల్‌లో జరిగిన డీప్ డైవ్ కార్యక్రమంలో ఎపి సిఎం చంద్రబాబు శాసనసభ తోపాటు , హైకోర్టు, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ల డిజైన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా గతంలో ప్రభుత్వం సూచించిన మార్పుచేర్పుల గురించి నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు చంద్రబాబుకు వివరించారు.

    మార్పులు చేర్పులు...

    మార్పులు చేర్పులు...

    1350 ఎకరాల్లో నిర్మించే సచివాలయం,పరిపాలనా నగర ప్రణాళికల డిజైన్లను ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అందులో పార్కులు, రహదారుల ప్రణాళికలో కొన్ని మార్పులు చేశారు. శాసనసభ, సచివాలయం, ప్రభుత్వాధికారుల కార్యాలయాలన్నీ ఈ బ్లాక్‌లోకే వస్తాయి. గతంలో శాసనసభ భవనం ఈ బ్లాక్‌ చివరగా ఉండేట్లుగా సపరేటుగా డిజైన్ చేశారు. కానీ ఇప్పుడు దానిని బ్లాక్ మధ్యలోకి మార్చారు.

    కొత్త అసెంబ్లీ ఇలా ఉంటుంది...

    కొత్త అసెంబ్లీ ఇలా ఉంటుంది...

    నగర ప్రణాళిక బ్లాక్ మొత్తం 250 ఎకరాలు కాగా, అందులో 120 ఎకరాల్లో ఓ తటాకంలా ఏర్పాటు చేసి, దాని మధ్యలో అసెంబ్లీ భవనాన్నిటవర్ ఆకృతిలో నిర్మించనున్నారు. ఆ తటాకంలో భవనం ప్రతిబింబం కనిపించేలా నిర్మాణం జరుపుతారు. ఈ భవనం ఎత్తు 250 మీటర్లు కాగా, సందర్శకులు 40 మీటర్ల వరకు పైకి వెళ్లి నగరాన్ని వీక్షించవచ్చు. ఇది మొత్తం నాలుగు విభాగాలుగా ఉంటుంది. శాసనసభ, శాసనమండలి సమావేశ మందిరాలు, సెంట్రల్ హాల్, పరిపాలనా భవనం తదితర విభాగాలుంటాయి. మధ్యలో మ్యూజియం ఉంటుంది.

    మెజారిటీ ఓటు...

    మెజారిటీ ఓటు...

    అసెంబ్లీ డిజైన్ పై సోషల్ మీడియాలో జనాభిప్రాయం కోరగా, 68 శాతం మంది దీనికి ఓకే చెప్పినట్లు తెలిసింది. శుక్రవారం నాటికి మొత్తం 24,905 మంది స్పందించగా, వారిలో 17,088 మందిఈ టవర్ డిజైన్ కే ఓటేశారు. 7,817 మంది మాత్రం చతురస్రాకారపు డిజైన్ కు మొగ్గు చూపినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+