Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చావే మాకు శరణ్యం.. జీడితోటలలో ఉరికి సిద్ధమైన గిరిజన మహిళలు; షాకింగ్ వీడియో!!

వారంతా గిరిజన మహిళలు. ఉరవకొండ ప్రాంతంలో భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. జీడి మామిడి తోటల సాగు ద్వారా జీవనోపాధి పొందుతున్న మహిళలకు ఇప్పుడు ఎక్కడ లేని కష్టం వచ్చి పడింది. కొందరు గ్రానైట్ కంపెనీ నిర్వాహకుల కళ్ళు ఈ జీడి మామిడి తోటలపై పడ్డాయి. దీంతో జీడిమామిడి సాగు చేస్తున్న గిరిజన మహిళలు వినూత్న రీతిలో తమ నిరసనను తెలియజేసి తమ సమస్యలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

జీడి మామిడి తోటలో చెట్టు కొమ్మలకు ఉరికి సిద్ధమైన మహిళల ఆవేదన

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా ఉరవకొండలోని జీడి మామిడి తోట వద్ద ఆందోళనకర దృశ్యం అందరినీ ఆలోచించేలా చేసింది. చెట్టు కొమ్మలకు చీరలు కట్టుకున్న గిరిజన మహిళలు తమ మెడకు తాత్కాలిక ఉరిని బిగించుకుని తమ సమస్యను చెప్పుకున్నారు. మా విన్నపాన్ని వినకుంటే మాకు చావే శరణ్యం అంటూ ఓ వీడియోలో వారు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఇంతకీ ఉరవకొండ మహిళలు జీడి మామిడి చెట్ల కొమ్మలకు చీరతో ఉరికి సిద్ధమై తమ ఆవేదనను తెలియజేయడం వెనుక కారణం ఏమిటి అంటే

జీడి మామిడి తోటలను తొలగించి గ్రానైట్ కంపెనీకి కట్టబెడుతున్నారని ఆందోళన

జీడి మామిడి తోటలను తొలగించి గ్రానైట్ కంపెనీకి కట్టబెడుతున్నారని ఆందోళన

విశాఖ జిల్లా మాడుగుల రెవెన్యూ పరిధిలోని ఉరవకొండలో జీడి మామిడి తోటలను తొలగించి గ్రానైట్ కంపెనీకి కట్టబెడుతున్నారంటూ మహిళలు ఆరోపణలు చేశారు. తాము జీడి మామిడి తోటలపై ఆధారపడి జీవిస్తున్నామని, డి పట్టా భూములను ప్రభుత్వమే ఇచ్చిందని వారు చెబుతున్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే, తహసీల్దార్ గిరిజనులపై వివక్ష చూపడంతో ఈ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. తమకు జీవనాధారమైన జీడి తోటలను తొలగిస్తే, తాము మృత్యువును కౌగిలించుకోవడం తప్ప వేరే మార్గం లేదని వారు చెప్తున్నారు.

అడ్డుకుంటే కేసులు పెడుతున్నారన్న గిరిజన మహిళలు .. విచారణకు డిమాండ్

అడ్డుకుంటే కేసులు పెడుతున్నారన్న గిరిజన మహిళలు .. విచారణకు డిమాండ్


తాము ఏ గ్రానైట్ కంపెనీ నుంచి డబ్బులు తీసుకోలేదు.. కొందరు వ్యక్తులు మా భూములను అక్రమంగా గ్రానైట్ కంపెనీ కి కట్టబెట్టారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా వద్ద భూ యాజమాన్య హక్కు పత్రాలు లేవని ఈ కారణంగా జీడి మామిడి తోటలను నాశనం చేయడం కోసం, రోడ్లు వేయడం కోసం సదరు అక్రమార్కులు జెసిబి లను తెచ్చారని ఆరోపిస్తున్నారు. మా తోట గుండా రోడ్లు వేయాలని చూస్తున్న మైనింగ్ కంపెనీని అడ్డుకుంటే మాడుగుల మండల రెవెన్యూ అధికారి మాపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, దీనిపై జాయింట్ కలెక్టర్ విచారణ జరిపించాలని మహిళలు కోరుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+