తిరుమలకు ప్లాన్ చేసుకున్నారా, భక్తులకు TTD కీలక సూచన..!!
Tirumala: తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ కీలక సూచన చేసింది. తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. సంక్రాంతి సెలవులు ప్రారంభం కానుండటంతో భక్తుల రద్దీ క్రమేణా పెరిగే అవకాశం ఉందని టీటీడీ భావిస్తోంది. ఈ నెల 25న రథసప్తమి కారణంగా పలు సేవలు రద్దు చేసారు. ఇక.. శ్రీవారి మెట్టు మార్గంలో మరోసారి చిరుత కనిపించింది. భక్తులు ఆందోళన చెందకుండా టీటీడీ కీలక సూచనలు చేసింది. అదనపు సిబ్బందిని మొహరించింది.
తిరుమలలో రద్దీ సంక్రాంతి సెలవుల వేళ మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. ఇక.. ఈ నెల 25న రథసప్తమి నిర్వహించనుంది. ఈ సమయంలో టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. ఎన్.ఆర్.ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలను కూడా రద్దు చేసింది. తిరుపతిలో జనవరి 24 నుండి 26వ తేది వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ రద్దు చేసింది. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి జనవరి 24న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించటం లేదని స్పష్టం చేసింది.

ఇక, శ్రీవారి మెట్టుమార్గంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. 400వ మెట్టు వద్ద చిరుత సంచారాన్ని భక్తులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది చిరుతను గుర్తించే పని మొదలు పెట్టారు. ఒక మహిళ చిరుతను ప్రత్యక్షంగా చూసినట్లు తెలిపి వెంటనే టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ అధికారులు అక్కడకి చేరుకుని పాదముద్రలను పరిశీలించారు. పరిశీలన తర్వాత అక్కడ చిరుత సంచారం ఉన్నట్లు ధ్రువీకరించారు.
తిరుమల మార్గంలో భక్తులను 100 నుంచి 150 మంది చొప్పున గుంపులుగా మాత్రమే అనుమతిస్తున్నారు. భక్తులు చిన్నపిల్లలను జాగ్రత్తగా పట్టుకొని వెళ్లాలని, వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచించారు. సమూహాలుగా మాత్రమే వెళ్లాలని, ఒంటరిగా మెట్లు ఎక్కొద్దని సూచించారు. సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకోవాలని తెలిపారు. చిరుతను గుర్తించి పట్టుకునేందుకు అటవీ అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications