తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఛైర్మన్ అలర్ట్..! స్పెషల్ డ్రైవ్ ..!
ఏపీలో తిరుమల శ్రీవారికి భక్తుల్లో ఉన్న నమ్మకం అంతా ఇంతా కాదు. ఏడుకొండల వాడిని దర్శించుకుంటే సర్వ సమస్యలు తీరిపోతాయని భావించే భక్తుల నమ్మకాన్ని కొందరు దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. తిరుమల దర్శనంతో పాటు రూమ్ బుకింగ్స్, ఇతర సేవల పేరిట వారిని దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టీటీడీ) ఛైర్మన్ బీఆర్ నాయుడు భక్తులకు ఇవాళ కీలక విజ్ఞప్తి చేసారు. ఈ మేరకు ఎక్స్ లో ఆయన పోస్టు పెట్టారు.
శ్రీవారి దర్శన టిక్కెట్లు కోసం దళారీలు, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దంటూ ఎక్స్ లో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పోస్ట్ పెట్టారు. మధ్యవర్తులు పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసి భక్తులను మోసం చేసిన అనేక సందర్భాలు కూడా బయటపడ్డాయని వారికి గుర్తుచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానాల అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే తమ దర్శన టిక్కెట్లను బుక్ చేసుకోవాలని భక్తులకు సూచించారు.

దర్శనం లేదా వసతి కోసం ఏ మధ్యవర్తులను సంప్రదించవద్దని భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నట్లు బీఆర్ నాయుడు తెలిపారు.
భక్తులను మోసం చేస్తున్న దళారీలను గుర్తించి వారిపై చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడానికి టీటీడీ ప్రత్యేక డ్రైవ్ను నడుపుతోందన్నారు. మధ్యవర్తులు, దళారీలు సంప్రదిస్తే విజిలెన్స్ మరియు పోలీసుకు ఫిర్యాదు చేయాలని భక్తులను అభ్యర్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే తిరుమలను శుభ్రంగా, సురక్షితంగా ఉంచడానికి అందరూ చేతులు కలుపుదామని టీటీడీ ఛైర్మన్ పిలుపునిచ్చారు.

Dear Devotees of Lord Venkateswara,
— B R Naidu (@BollineniRNaidu) October 18, 2025
It has come to my notice that several touts and middlemen have been indulging in different types of modus operandi to trap gullible devotees by offering to help them book the most sought after VIP break Darshan and arjitha sevas at Tirumala…
తిరుమల దర్శనానికి వచ్చే భక్తులు శ్రీవారికి నిలువునా సమర్పించుకుంటుండగా.. భక్తుల్ని దళారులు నిలువుగా దోచుకుంటున్నారన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతున్నా, టీటీడీ బోర్డులు మారుతున్నా, సభ్యులు మారుతున్నా ఈ పరిస్దితిలో మాత్రం మార్పు రావడం లేదు. ఈ నేపథ్యంలో మరోసారి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు భక్తులకు ఈ సూచనలు చేశారు. వీటిని భక్తులు పాటిస్తే కచ్చితంగా దర్శనం లభిస్తుందని టీటీడీ వర్గాలు పేర్కొంటున్నాయి.
-
అరుణాచలం వెళ్తున్నారా, కీలక సమాచారం..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications