తెలుగుదేశం పార్టీకి చిత్తూరులో షాక్: ఇద్దరు కౌన్సిలర్ల రాజీనామా
చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో టీడీపీ కౌన్సెలర్లు సుమంత్, తులసీ తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు తమ రాజీనామా లేఖలను మున్సిపల్ కమిషనర్కు అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తమ వార్డుల్లో అభివృద్ధికి పురపాలక సంఘం నిధులు కేటాయింపులో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని, అందుకే రాజీనామా చేస్తున్నామని చెప్పారు.
అధికార పార్టీకే చెందిన కౌన్సిలర్లు నిధులు ఇవ్వడం లేదని చెబుతూ రాజీనామాలు చేయడం చర్చనీయాశంగా మారింది. వారి అసంతృప్తిని తెలుసుకునేందుకు టీడీపీ నాయకులు రంగంలోకి దిగారని తెలుస్తోంది.
Comments
English summary
Two counselors resinged in Chittoor district on Wednesday.
Story first published: Wednesday, February 28, 2018, 15:37 [IST]