భారీగా గంజాయి స్వాధీనం: 410 కేజీల పట్టివేత (ఫోటోలు)
విశాఖపట్నం: అక్రమంగా గంజాయి రవాణాకు పాల్పడుతున్న ముఠాను పెందుర్తి పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుండి సుమారు రూ. 4 లక్షలు విలువ గల 410 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గాజువాక డీసీపీ రాంగోపాల్ నాయక్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విశ్వసనీయ సమాచారం మేరక శనివారం రాత్రి పెందుర్తి రక్షక్ ఎస్ఐ రమేశ్ తన సిబ్బందితో కలసి సుజాతనగర్లో ఒక ఇంటిపై దాడి చేసి అక్రమంగా నిలువ ఉంచిన 410 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

భారీగా గంజాయి స్వాధీనం: 410 కేజీల పట్టివేత
ఈ కేసులో చింతపల్లి మండలం లోతుగెడ్డ గ్రామానికి చెందిన గుల్లెల వినోద్ కుమార్, రోలుగుంట మండలం వాడిప గ్రామానికి చెందిన ముక్కడపల్లి నాగేశ్వరరావు, వేపగుంట, అప్పలనరసయ్య కాలనీకి చెందిన అబ్దుల్ బాషా, చింతపల్లి, లోతుగడ్డ ప్రాంతానికి చెందిన గుల్లెల లోవరాజు, తమిళనాడుకు చెందిన సయ్యద్ ఖాజా, ఒడిశా కటక్ జిల్లాస, చౌదా గ్రామానికి చెందిన అసిత్ దిబేటాలను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.
భారీగా గంజాయి స్వాధీనం: 410 కేజీల పట్టివేత
చింతపల్లి, లోతుగెడ్డ గ్రామానికి చెందిన గుల్లెల వినోద్ కుమార్, గుల్లెల లోవరాజులు అన్నదమ్ములు. వినోద్ కుమార్ ఆటో డ్రైవర్గా పెందుర్తిలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు.

భారీగా గంజాయి స్వాధీనం: 410 కేజీల పట్టివేత
ఇతను సోదరుడితో గంజాయని తన ఆటోలో నగరానికి తీసుకువచ్చి సుజాతనగర్లో శివారు ప్రాంతంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని భద్రపరుస్తుంటాడు.

భారీగా గంజాయి స్వాధీనం: 410 కేజీల పట్టివేత
ఆటోలో గంజాయి పెట్టి ఎవరికీ అనుమానం రాకుండా గంజాయిపై స్టీల్ సామాను లోడ్ చేసి నగరానికి తీసుకువస్తుంటారు. పెందుర్తి నుంచి గంజాయిని రైళ్ల ద్వారా తమిళనాడు, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలకు సరఫరా చేస్తుంటారు.












Click it and Unblock the Notifications