Crime News: ఉపాధ్యాయుల ప్రాణం తీసిన ఫొటో షూట్.. గోదావరిలో మునిగి ఇద్దరు మృతి..
ఫొటో సరదా ప్రాణాలు తీసింది. దీపావళి పండుగ వేళ విషాదం నింపింది. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఫొటో షూట్ కు వెళ్లిన ఉపాధ్యాయులు గల్లంతయ్యారు.
జిల్లాలోని కోటపల్లి మండలం ఎర్రాయిపేట సమీపంలో ఈ ఘటన జరిగింది. చెన్నూర్ పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో కేరళకు చెందిన టోనీ, బిజూ, ఆంటోనీ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. దీపావళి సందర్భంగా వరుసగా సెలవులు రావడంతో వారు ఫోటోషూట్, సరదాగా గడిపేందుకు ముగ్గురూ గోదావరి తీరానికి వెళ్లారు.
ఈత
ఫోటో షూట్ తర్వాత ఈత కొట్టడానికి బిజూ, టోనీ, ఆంటోనీ గోదావరిలోకి దిగారు. బిజూ, టోనీ నదిలో గల్లంతు అయ్యారు. వారి ఆంటోనీ కాపాడే ప్రయత్నం చేసినా వారిని కాపాడలేకపోయాడు. ఆంటోనీ వెంటనే ఒడ్డుకు చేరి స్థానికులను పిలిచాడు. కానీ బిజూ, టోనీ అప్పటికే నీటిలో మునిగిపోయారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో మృతదేహాల కోసం గాలింపు చేపట్టారు. ఒకరి మృతదేహం లభించగా.. మరో మృతదేహం కోసం గాలింపు సాగుతోంది.

పోలీసుల హెచ్చరిక
కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. కేరళలోని మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. నదీ పరివాహాక ప్రాంతాలు, చెరువుల వద్దకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈత రాని వారు నదులు, చెరువుల్లోకి దిగొద్దని హెచ్చరిస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications