వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోజాను అనుమతిస్తారా?: సారీ చెప్పింది కానీ.. వంగలపూడి అనిత ఆవేదన

అసెంబ్లీ సమావేశాలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను అనుమతించాలా? లేదా? అనే అంశంపై గురువారం నాడి కేబినెట్ భేటీలో చర్చ జరిగింది.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: అసెంబ్లీ సమావేశాలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను అనుమతించాలా? లేదా? అనే అంశంపై గురువారం నాడి కేబినెట్ భేటీలో చర్చ జరిగింది.

<strong>జగన్ వీడియో చూసిన చంద్రబాబు ఇలా..</strong>జగన్ వీడియో చూసిన చంద్రబాబు ఇలా..

ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రోజా పైన విధించిన ఏడాది సస్పెన్షన్‌ గడువు పూర్తయిందని, ఈ నేపథ్యంలో శాసనసభ సమావేశాలకు ఆమెను అనుమతించాలా? వద్దా? అన్న విషయంలో వ్యూహ కమిటీ సమావేశంలో చర్చ జరిగింది.

roja

దీనిపై వంగలపూడి అనిత జోక్యం చేసుకుంటూ.. క్షమాపణ కోరుతూ రోజా లేఖ రాసినా, ఆమెలో పశ్చాత్తాపం కనిపించడం లేదని, రోజా తనకు వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పాల్సిందేనని పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. అయితే, సమావేశాలు మొదలయ్యాక దీని గురించి మాట్లాడుదామని చంద్రబాబు చెప్పారని తెలుస్తోంది.

గన్నవరం కోర్టు వద్ద రోజాకు చేదు అనుభవం, రంగంలోకి పోలీసులుగన్నవరం కోర్టు వద్ద రోజాకు చేదు అనుభవం, రంగంలోకి పోలీసులు

కాగా, తనకు వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పాల్సిందేనని అనిత వ్యాఖ్యానించడంపై రోజా శుక్రవారం నాడు స్పందించారు. తనను తిడితేనే పదవులు వస్తాయని అనిత భావించడం బాధాకరమన్నారు. గతంలో టిడిపిలో తనకు ఎదురైన పరిస్థితులే రేపు అనితకు ఎదురవుతాయన్నారు.

అసెంబ్లీలో సీఎం చంద్రబాబు పైన పరుష వ్యాఖ్యలు చేశారనే కారణంతో రోజా పైన ఏడాది పాటు సస్పెన్షన్ వేటు వేశారు. ఆమె పైన సస్పెన్షన్ గడువు ముగిసింది. దీంతో ఆమెను అసెంబ్లీలోకి అనుమతిస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.

English summary
Telugudesam Party MLA Vangalapudi Anitha on Thursday demanded apology from YSRCP MLA Roja.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X