బాబుకు గట్టి షాక్: కేసీఆర్కు చుక్కలు చూపిన వంటేరు కాంగ్రెస్లోకి, ఎర్రబెల్లి అల్లుడు కూడా
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణలో మరో గట్టి షాక్. పలువురు కీలక నేతలు టీడీపీని వీడి టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో చేరుతున్నారు. ఇప్పుడు మరో రెండు వికెట్లు పడనున్నాయి. వంటేరు ప్రతాప్ రెడ్డి, మదన్ మోహన్ రావులు త్వరలో కాంగ్రెస్లో చేరనున్నారు.
వంటేరు ప్రతాప్ రెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లాలో టీడీపీకి కీలక నేత. గజ్వెల్లో ఆయనకు పార్టీ పరంగా, వ్యక్తిగతంగా మంచి పట్టు ఉంది. 2014లో ముఖ్యమంత్రి కేసీఆర్పై వంటేరు పోటీ చేసి టీఆర్ఎస్లో వణుకు పుట్టించారు. ఓ సమయంలో వంటేరు చేతిలో కేసీఆర్ ఓడిపోతారనే వాదనలు వినిపించాయి.

ఈ నెల 18న కాంగ్రెస్లోకి వంటేరు
అలాంటి వంటేరు ప్రతాప్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నెల 18వ తేదీన ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సమక్షంలో ఢిల్లీలో ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. టీడీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఉద్దేశ్యంతోనే ఆయన పార్టీ మారుతున్నారని భావిస్తున్నారు.

ఇలా టీడీపీ దెబ్బతింటోంది
రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ కొంత దెబ్బతిన్నది. ఓటుకు నోటు కేసు తర్వాత మరింత దెబ్బతిన్నది. ఆ తర్వాత తెలంగాణలో టీడీపీకి బలమైన నేతగా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో ఆయనతో పాటు చాలామంది ముఖ్య నేతలు నడిచారు. ఆ సమయంలోనే వంటేరు కూడా కాంగ్రెస్లో చేరుతారని భావించారు.

కాంగ్రెస్లోకి ఎర్రబెల్లి మేనల్లుడు
కానీ, రేవంత్ కాంగ్రెస్లో చేరిన చాన్నాళ్లకు ఆయన కూడా అదే బాట పట్టనున్నారు. వంటేరు శుక్రవారం అనుచరులతో కలిసి కాంగ్రెస్లో చేరనున్నారని భావించారు. కానీ మరికొందరిపాటు ఈ నెల 18న చేరనున్నారు. ఆయనతో పాటు మరో టీడీపీ నేత మధన్ మోహన్ రావు కూడా కాంగ్రెస్ జెండా పట్టుకోనున్నారు.

ఏపీపై చంద్రబాబు దృష్టి
మధన్ మోహన్ రావు టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర రావు అల్లుడు. ఆయన గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున జహీరాబాద్ నుంచి పోటీ చేశారు. చంద్రబాబు ఏపీపై దృష్టి సారించడంతో పాటు తెలంగాణలో టీడీపీ పట్టు కోల్పోతుందనే ఉద్దేశ్యంతోనే వరుసగా నేతలు పార్టీని వీడుతున్నారని చెబుతున్నారు. తెలంగాణలో టీడీపీ కనుమరుగైనట్లేనని విపక్షాలు అంటున్నాయి.
-
ఇకపై టెన్త్ పరీక్షలు ఉండవు.. విద్యార్థులకు, తల్లిదండ్రులకు సీఎం రేవంత్ రెడ్డి తీపికబురు! -
ఇది ఫేక్, ఫేకర్, ఫేకెస్ట్ ప్రభుత్వం.. రివిజన్, ఫ్యాబ్రికేటెడ్ బడ్జెట్: కవిత ధ్వజం -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!!











Click it and Unblock the Notifications