ఉపరాష్ట్రపతి వెంకయ్య మార్క్: ప్రత్యేక హోదా నినాదం - చరిత్రలో నిలిచిపోయేలా..!!
ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పదవీ కాలం ముగుస్తోంది. ఈ నెల 10న ఆయన పదవీ విరమణ చేయనున్నారు. తాజాగా జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ ప్రతిపాదించిన ధన్ కర్ గెలుపొందారు. ఈ నెల 11న ఆయన నూతన ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే వెంకయ్య నాయుడు పదవీ విరమణ తరువాత ఢిల్లీలోనే మరో నివాసం లో ఉండేందుకు ఒక భవనం కేటాయించారు. అయితే, సుదీర్ఘ రాజకీయ నేపథ్యం.. అయిదేళ్లుగా ఉప రాష్ట్రపతిగా.. రాజ్యసభ ఛైర్మన్ గా వెంకయ్య నాయుడు తన మార్క్ చూపించారు.
రాజ్యసభ ఛైర్మన్ గా వెంకయ్య
ఛైర్మన్
హోదాలో
ఉన్న
సమయంలో
ఆంధ్రప్రదేశ్కు
ప్రత్యేక
హోదా
అంశం
నాలుగు
సమావేశాల్లో
36
రోజుల
పాటు
సభ
కార్యకలాపాలను
అడ్డుకుంది.
2018
బడ్జెట్
సమావేశాల్లో
అత్యధికంగా
24
సార్లు
ఇది
సభ
స్తంభించిపోవడానికి
దారితీసింది.
2021
శీతాకాల
సమావేశాల్లో
12
మంది
ప్రతిపక్ష
సభ్యులను
సస్పెండ్
చేయడం
వంటివి
వెంకయ్యనాయుడి
హయాంలో
వివాదాస్పదంగా
మారాయి.
రాజ్యసభ
ఛైర్మన్
గా
తన
అయిదేళ్ల
పదవీ
నిర్వహణ
పైన
వెంకయ్య
నాయుడు
రాజ్యసభ
2017-2022..ఒక
వీక్షణం'
అనే
పుస్తకాన్ని
రూపొందించారు.
రేపు
(సోమవారం)
ఈ
పుస్తకాన్ని
ఆవిష్కరించనున్నారు.
సభా నిర్వహణలో తన మార్క్
ఛైర్మన్
హోదాలో
సభ్యులతకు
తమ
మాతృభాషల్లో
మాట్లాడేందుకు
వెంకయ్య
ప్రోత్సాహం
అందించారు.
రాజ్యసభ
ఛైర్మన్గా
వెంకయ్యనాయుడు
ఇప్పటివరకు
13
పూర్తి
సెషన్స్కి
నేతృత్వం
వహించారు.
289
రోజులకు
గానూ
సభ
261
రోజులు
సమావేశమైంది.
913
గంటల
11
నిమిషాలు
సభ
జరిగింది.
ఈ
13
సెషన్స్లో
177
బిల్లులు
ఆమోదం
పొందాయి.
ఏపీకి
ప్రత్యేక
హోదా
నినాదంతో
36
సిట్టింగ్స్
వాయిదా
పడ్డాయి.
2014
లో
రాష్ట్ర
పునర్విభజన
చట్టం
అమలు
సమయంలో
ఏపీకి
ప్రత్యేక
హోదా
పైన
నాటి
రాజ్యసభ
లో
విపక్ష
నేత
హోదాలో
వెంకయ్య
నాయుడు
పట్టు
బట్టారు.
ఆయన
ఛైర్మన్
గా
ఉన్న
సమయంలోనే
ఇదే
నినాదం
పైన
సభలు
మాలు
మార్లు
వాయిదా
వేయాల్సి
వచ్చింది.
Recommended Video
ఏపీకి ప్రత్యేక హోదా- కీలక బిల్లుల వేళ
ఆర్టికల్
370
రద్దు,
త్రిపుల్
తలాక్
బిల్లు,
పౌరసత్వ
సవరణ,
వివాద్
సే
విశ్వాస్,
సామాజిక
భద్రత
కోడ్,
అద్దె
గర్భ
నియంత్రణ
బిల్లు
వంటివి
వెంకయ్య
ఛైర్మన్
గా
ఉన్న
సమయంలో
ఆమోదం
పొందిన
చరిత్రాత్మక
బిల్లులుగా
నిలిచాయి.
సభలో
సభ్యులకు
సమయం
కేటాయింపు..
మాట్లాడే
అవకాశం..
సభా
నిర్వహణ..
క్రమశిక్షణ..కఠిన
వైఖరి
వంటి
విషయానల్లో
అయిదేళ్ల
కాలంలో
రాజ్యజభ
ఛైర్మన్
గా
వెంకయ్య
నాయుడు
తన
ముద్ర
వేశారు.
ఇక,
ఈ
సమావేశాల్లోనే
వెంకయ్య
నాయుడుకు
సభ
వీడ్కోలు
పలకనుంది.
నిత్యం..
ప్రజల్లో
లేదా
సభల్లో
తన
ప్రత్యేకత
చాటిన
వెంకయ్య
నాయుడు
ఈ
నెల
10వ
తేదీ
తరువాత
మాజీగా
ఉంటారా..
లేక,
తన
కుటుంబానికి
చెందిన
స్వర్ణ
భారత్
ట్రస్ట్
ద్వారా
సామాజిక
సేవలో
భాగస్వాములవుతారా
అనేది
చూడాలి.