విషాదం: గోడ కూలి బిల్డింగ్ ఇన్స్పెక్టర్ మృతి(పిక్చర్స్)
విశాఖపట్నం: బీఆర్టీఎస్ పనుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ప్రధాన రహదారి విస్తరణ పనులు చేపడుతుండగా శుక్రవారం గోడ కూలి ఒక బిల్డింగ్ ఇన్స్పెక్టర్ మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కంచరపాలెం ఊర్వశి జంక్షన్ వద్ద రెండు రోజుల నుంచి ప్రధాన రహదారి విస్తరణ పనులు సాగుతున్నాయి.
శుక్రవారం ఉదయం థియేటర్ పక్కనే ఉన్న భారీ గోడ తొలగింపు కార్యక్రమం చేపట్టారు. ఆ పనులను జేసీబీతో చేయిస్తుండగా డిసిపి మీనాకుమారి, నాల్గవ జోన్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు బి చక్రధర్, రాజు, టిపిఎస్ శ్రీలక్ష్మీ పర్యవేక్షిస్తున్నారు. అయితే ఒక్కసారిగా గోడకూలడంతో అంతా వెనక్కి పరుగులు తీశారు.
కానీ, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ చక్రధర్ మాత్రం వెనక్కి వెళ్లే క్రమంలో కాలి చెప్పు మెలికపడి కిందపడిపోయారు. ఆయనపై గోడ కూలిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. చక్రధర్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం. ఘటనా స్థలానికి చేరుకున్న చక్రధర్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే నాల్గవ జోన్ జోనల్ కమిషనర్ నాగనరసింహారావు, చీఫ్ సిటీప్లానర్ వెంకటరత్నం, డిసిపి వెంకటసుబ్బయ్య, తదితర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

బిల్డింగ్ ఇన్స్పెక్టర్ మృతి
బీఆర్టీఎస్ పనుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ప్రధాన రహదారి విస్తరణ పనులు చేపడుతుండగా శుక్రవారం గోడ కూలి ఒక బిల్డింగ్ ఇన్స్పెక్టర్ మృతి చెందాడు.

బిల్డింగ్ ఇన్స్పెక్టర్ మృతి
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కంచరపాలెం ఊర్వశి జంక్షన్ వద్ద రెండు రోజుల నుంచి ప్రధాన రహదారి విస్తరణ పనులు సాగుతున్నాయి.

బిల్డింగ్ ఇన్స్పెక్టర్ మృతి
శుక్రవారం ఉదయం థియేటర్ పక్కనే ఉన్న భారీ గోడ తొలగింపు కార్యక్రమం చేపట్టారు.

బిల్డింగ్ ఇన్స్పెక్టర్ మృతి
ఆ పనులను జేసీబీతో చేయిస్తుండగా డిసిపి మీనాకుమారి, నాల్గవ జోన్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు బి చక్రధర్, రాజు, టిపిఎస్ శ్రీలక్ష్మీ పర్యవేక్షిస్తున్నారు. అయితే ఒక్కసారిగా గోడకూలడంతో అంతా వెనక్కి పరుగులు తీశారు.












Click it and Unblock the Notifications