ఇప్పుడు నోరు మెదపడం లేదు: కెసిఆర్పై పొన్నాల
హైదరాబాద్: పొత్తుల కోసం తాము అర్రులు చాచడం లేదని, పొత్తుల కోసం ప్రతిపాదనలు వస్తే పరిశీలిస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (టిపిసిసి) అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై విమర్శలు చేశారు. ఇటీవల ఒక మహా నాయకుడికి బీసీలు ఇప్పుడే జ్ఞాపకం వచ్చారని ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి విమర్శించారు.
మరో ఉద్యమపార్టీ నేత తెలంగాణ వస్తే దళితులను ముఖ్యమంత్రిగా, మైనారిటీలను ఉపముఖ్యమంత్రిగా చేస్తానని మాట్లాడి, తెలంగాణ ఆవిర్భావం తర్వాత నోరు మెదపడం లేదని ఆయన కెసిఆర్ను ఉద్దేశించి అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు శాశ్వతం కాదన్నారు. సామాజిక తెలంగాణ కోసమే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. బుధవారంనాడు ఆయన గాంధీభవన్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

రెండు ఎంపీ సీట్ల బలం మాత్రమే ఉందని, అందులోనూ ఒక ఎంపీ సరిగా లేని పార్టీ అది, దాంతో తెలంగాణ వచ్చిందంటే ప్రజాస్వామ్యవాదులెవరైనా నమ్ముతారా? అని ఆయన తెరాసను ఉద్దేశించి ప్రశ్నించారు. విలీనం విషయంలో కెసిఆర్ మాట తప్పారన్న విషయంలో సందేహమెందుకని ఆయన మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నకు సమాధానంగా ఎదురు ప్రశ్న వేశారు.
దళిత, వెనుకబడిన, మైనారిటీ, మహిళలకు సముచిత స్థానం కల్పించడంలో కాంగ్రెస్ తొలి నుంచీ ముందుందన్నారు. పార్టీలోని అన్నీ వర్గాల అభిప్రాయాలను గౌరవిస్తూ సమన్వయంతో ముందుకు పోతామన్నారు. అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ ఏర్పాటైందన్నారు. అమరవీరుల త్యాగాలు చరిత్రలో నిలిచిపోయే విధంగా కాంగ్రెస్ కృషి చేస్తుందన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యోగావకాశాల్లో వారికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. తెలంగాణ నవ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
జై తెలంగాణ తమ నినాదమని, జైజై తెలంగాణ తమ విధానమన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలంగా ఉందన్నారు. తనకు తెలంగాణ పీసీసీ అధ్యక్షపదవి ఇచ్చినందుకు సీనియర్లు అసంతృప్తితో ఉన్నారన్న వ్యాఖ్యలను కొట్టివేశారు. అందరినీ కలుపుకుని పార్టీని విజయపథంలో నడిపించేందుకు కృషి చేస్తానన్నారు.
తెలంగాణ పునర్నిర్మాణం కెసిఆర్తోనే సాధ్యమని తెరాస నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై పొన్నాల స్పందించారు. పునర్నిర్మాణం అనే పదమే తప్పు అన్నారు. ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఎక్కడా జరగలేదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ సోనియగాంధీ తెలంగాణ ఇవ్వడంతో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు సంతోషంగా ఉన్నారన్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications