ముందు లోంగిపోతానని ప్రకటించండి , అడవిలో వైద్య చికిత్స అందిస్తాం :డి.జిపి
అమరావతి :అడవిలో నక్సలైట్లు ఇంకా ఉన్నారుని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎన్ కౌంటర్ లో గాయపడిన నక్సలైట్లకు చికిత్స అవసరమని పోలీసులు అభిప్రాయంతో ఉన్నారు. గాయపడిన మావోయిస్టులకు వైద్య సహాయం చేసేందకు తాము సిద్దంగా ఉన్నామని ఆంద్రప్రదేశ్ డిజిపి సాంబశివరావు ప్రకటించారు.అయితే లొంగిపోతామని మావోలు మీడియా ద్వారా ప్రకటించాలని ఆయన షరతు విధించారు.
ఎన్ కౌంటర్ లో మావోయిస్టులు గాయపడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. గాయపడిన వారిలో మావోల అగ్రనేతలు ఉండి ఉండవచ్చనే అనుమానాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.మావోయిస్టులపై తమకు వ్యతిరేకత లేదన్నారు డిజిపి.సామాన్యులపై అకారణంగా దాడులు చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.మావోయిస్టులంటే తమ వ్యక్తిగతంగా ద్వేషం లేదన్నారు డిజిపి.

మావోల శిబిరం వద్దకు తమ బలగాలు చేరిన వెంటనే మావోల సెంట్రీలు తమపై కాల్పులకు దిగాడన్నారు. ఆత్మరక్షణ కోసం తాము కాల్పులకు పాల్పడినట్టు చెప్పారు డిజిపితాము అప్రమత్తంగా లేకపోతే తమ వైపు పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగేదని ఆయన అభిప్రాయపడ్డారు.మావోల శిబిరం వద్ద ఉన్న కిట్ బ్యాగులు , ఆయుదాల ఆదారంగా అగ్రనేతలున్నారని డిజిపి అనుమానించారు.ఈ ఘటనలో కొందరు మావోలు గాయపడ్డారని ఆయన అనుమానించారు. వారికి చికిత్స అందించేందుకు తాము సిద్దంగా ఉన్నట్టు చెప్పారు.అయితే లొంగిపోతామని మావోలు ముందుగానే మీడియా ముఖంగా ప్రకటించాలని ఆయన షరతు విధించారు. అవసరమైతే అడవిలోకి వెళ్ళి ట్రీట్ మెంట్ అందిస్తారని చెప్పారు.
ఐదుకొట్ల మందికి మా అండ
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయన తనయుడు లోకేష్ ను అంతమొందిస్తామని మావోలు రాసిన లేఖపై కూడ మీడియా సమావేశంలో డిజిపి ఘాటుగానే స్పందించారు. ఈ లేఖ ఎవరు విడుదల చేశారో స్పష్టత లేదన్నారు.ముఖ్యమంత్రి కుటుంబంలోని ఐదుగురితో పాటు రాష్ట్రంలోని ఐదు కోట్ల మందికి తమ అండ ఉంటుందన్నారు డిజిపి.మావోల లేఖ ఎక్కడి నుండి వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నట్టు చెప్పారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications