Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారీగా తగ్గిన గోధుమ పిండి ధర, ఇక్కడ మాత్రమే డిస్కౌంట్

రోజురోజుకూ పెరుగుతున్న ధరల మధ్య, ఇంటి ఖర్చులు ఎలా తట్టుకోవాలన్న ఆలోచన మధ్యతరగతి కుటుంబాలను వెంటాడుతోంది. ఇలాంటి సమయంలో రేషన్ వ్యవస్థలో జరుగుతున్న మార్పులు నిజంగా ప్రజలకు ఎంత లాభం చేకూరుస్తున్నాయో అనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. ఇదే అంశంపై ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

కిలో రేషన్ బియ్యానికి ప్రభుత్వం ఏకంగా రూ.47.10 వరకు ఖర్చు చేస్తోందని, ప్రజలకు మాత్రం అతి తక్కువ ధరకే అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. పాలిష్ చేసిన సన్నబియ్యంతో పోలిస్తే, రేషన్ ద్వారా అందించే బియ్యం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆయన స్పష్టం చేశారు.

Wheat Flour

రూ.20కే గోధుమ పిండి (Wheat Flour)

గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం రేషన్ కార్డుదారులకు రూ.20కే గోధుమ పిండి (Wheat Flour) అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో రోజుకు సుమారు 1,800 టన్నుల గోధుమ పిండిని పంపిణీ చేస్తున్నామని, త్వరలోనే ఈ సౌకర్యాన్ని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని తెలిపారు. గత ప్రభుత్వ పాలనపై మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. వైకాపా హయాంలో రేషన్ వ్యవస్థ ప్రజలకంటే కొందరికే ప్రయోజనం చేకూరేలా మారిందని, రేషన్ కార్డులను కూడా ప్రభుత్వ పథకం కాకుండా వ్యక్తిగత ప్రచార సాధనంగా ఉపయోగించారని ఆరోపించారు. కార్డులపై ఫొటోలు, ప్రత్యేక రంగులు వేసి ప్రజలను గందరగోళానికి గురిచేశారని విమర్శించారు.

15 రోజుల పాటు..

ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చాక రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు చేసినట్లు మంత్రి తెలిపారు. ఇకపై చౌకధరల దుకాణాలు నెలలో 15 రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. అలాగే స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా ఏ రేషన్ దుకాణంలోనైనా సరుకులు పొందే అవకాశం కల్పించామని వెల్లడించారు. రేషన్ డీలర్ల ఆదాయాన్ని కూడా పెంచే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందని మంత్రి తెలిపారు. రానున్న రోజుల్లో కొండ ప్రాంతాల ఉత్పత్తులు, సేంద్రియ సాగు వస్తువులను కూడా రేషన్ దుకాణాల ద్వారానే ప్రజలకు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.

మొత్తానికి, రేషన్ వ్యవస్థను కేవలం సరుకుల పంపిణీగా కాకుండా మధ్యతరగతి, పేద కుటుంబాల జీవన భద్రతకు బలమైన ఆధారంగా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నా.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+