ఏపీని పాకిస్థాన్తో పోల్చిన నేత
మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఆర్థికంగా పాకిస్తాన్లా మారుతోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సంపద సృష్టిస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన హామీలు ఏమయ్యాయని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. వరి ధాన్యం సేకరణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ఏడాది కాలంగా ప్రభుత్వం హనీమూన్ చేసిందని, ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. సూపర్ సిక్స్ హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు.
ప్రధాన ప్రతిపక్షంగా తమను గుర్తించకపోవడంపై బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 శాతం ప్రజలు తమకు ఓటు వేశారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి తాండవిస్తోందని ఆయన ఆరోపించారు. రైతుల సమస్యలపై వైసీపీ క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తుందని, జగన్ కూడా రైతుల వద్దకు వస్తారని ఆయన తెలిపారు. ఆక్వా, పొగాకు రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన చెప్పారు.

జూన్ లోపు మండల స్థాయి, జులై లోపు జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తామని, జూన్ 1 నుంచి 50 రోజుల్లో ఐదు జిల్లా పార్టీ సమావేశాలు నిర్వహిస్తామని బొత్స సత్యనారాయణ తెలిపారు. సీజ్ ద షిప్ హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఎకరం 99 పైసలకు ఇవ్వడం దేశంలో ఎక్కడా లేదని ఆయన అన్నారు. పోలీసులతో ప్రభుత్వాలు నడుపుతానంటే కలకలం తప్పదని ఆయన హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు విషయంలో సివిల్ సప్లై మంత్రి చెబుతున్న మాటలు అబద్ధాలని ఆయన అన్నారు.
పవన్ కళ్యాణ్ జిల్లా నుంచి గెలిచి డిప్యూటీ సీఎం అవ్వడం ఆయన అదృష్టమని, రైతుల వద్దకు రాకపోవడం రైతుల దురదృష్టమని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. తమ తాబేదారులకు బకాయిలు చెల్లించుకోవడానికి తమకు అభ్యంతరం లేదని, కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉందని, చిత్తశుద్ధి లేదా అని ఆయన ప్రశ్నించారు. సో కాల్డ్ కేంద్ర మంత్రి ఉద్దానంకు ఏం చేశారని ఆయన నిలదీశారు. సీపీఎస్ రద్దు ఏమైందని ఉద్యోగులు ప్రభుత్వాన్ని అడుగుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!!












Click it and Unblock the Notifications