అప్పుడే సూత్రధారి తేలుతుంది: మేకపాటి, షర్మిల-విజయమ్మలపై ఆరోపణ.. పీఎస్లో ఫిర్యాదు
ఉయ్యూరు/అమరావతి: తమ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాస్కు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి బుధవారంఅన్నారు.

బతికి ఉంటే సూత్రధారులు తెలుస్తారు
శ్రీనివాస రావు బతికి ఉంటే ఎప్పటికైనా వాస్తవాలు బయటకు వస్తాయని మేకపాటి చెప్పారు. అతను మాత్రం తనకు ప్రాణహానీ ఉందని చెప్పాడని, అయినా ప్రభుత్వానికి పట్టడం లేదని ఆరోపించారు. జగన్ పైన దాడి చేసింది శ్రీనివాస రావు అయినా, ఈ దాడి వెనుక సూత్రధారులు ఎవరో తేలాలని చెప్పారు.

విజయమ్మ, షర్మిలలపై చేసిన వ్యాఖ్యలకు రాజేంద్రప్రసాద్పై ఫిర్యాదు
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ పైన కృష్ణా జిల్లా ఉయ్యూరు పోలీస్ స్టేషన్లో వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. జగన్ పైన జరిగిన హత్యాయత్నంపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయమ్మ, షర్మిలలపై చేసిన వ్యాఖ్యలకు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

విజయమ్మ, షర్మిలలపై ఆరోపణలు, వైసీపీ సీరియస్
జగన్ పైన హత్యాయత్నం, విజయమ్మ, షర్మిలలపై టీడీపీ రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు, శ్రీనివాస రావు ఆరోగ్యంపై వైసీపీ సీరియస్గా ఉన్న విషయం తెలిసిందే. కాగా, జగన్పై జరిగిన దాడిలో అతనికి అయిన గాయం చిన్నదేనని డాక్టర్లు మంగళవారం తేల్చారు. హైదరాబాద్ సిటీ న్యూరో సెంటర్ డాక్టర్లు గాయాలకు సంబంధించిన సర్టిఫికేట్ జారీ చేశారు. జగన్ గాయాలకు సంబంధించిన సర్టిఫికేట్ను పోలీసులు కోరగా ఆసుపత్రి వర్గాలు జారీ చేశాయి. సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రి దానిని పోలీసులకు అందించింది.

జగన్ గాయం చిన్నదేనని సర్టిఫికేట్
అందులో.. జగన్ 18002386 ఇన్పేషంట్ నెంబరుతో ఈ నెల 25.10.2018 మధ్యాహ్నం 3.45 గంటలకు సిటీ న్యూరో ఆసుపత్రిలో చేరారని, 26.10.2018 మధ్యాహ్నం 12.54 గంటలకు డిశ్చార్జ్ అయ్యారని, ఈ మెడికో లీగల్ కేసులో నిర్వహించిన వైద్య పరీక్షల ప్రకారం అయనకైన గాయం స్వభావం చిన్నదేనని పేర్కొన్నారు. ఈ వివరాలు ఆధారంగా పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టనున్నారు.
-
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications