Heritage Foods: చంద్రబాబు విజయంతో దూసుకెళ్తోన్న హెరిటేజ్ స్టాక్..
హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ దూసుకెళ్తోంది. ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో స్టాక్ లో పాజిటివిటీ కనిపిస్తోంది. అంతేకాకుండా కేంద్రంలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో హెరిటేజ్ ఫుడ్స్ స్టాక్ భారీగా పెరుగుతోంది. గత మూడు సెషన్లలో ఈ స్టాక్ 43 శాతానికి పైగా పెరిగి తీవ్ర ర్యాలీని నమోదు చేయగా, గత 10 రోజుల్లో కౌంటర్ 55 శాతానికి పైగా పెరిగింది. హెరిటేజ్ గ్రూప్ను 1992లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, డెయిరీ, రిటైల్, అగ్రి అనే మూడు వ్యాపార విభాగాలతో హెరిటేజ్ ఫుడ్స్ కింద స్థాపించారు.
హెరిటేజ్ ఫుడ్స్ ప్రమోటర్లలో ఎన్ చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ఒకరని కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ పేర్కొన్నారు. హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు గురువారం నాడు 10 శాతం కంటే ఎక్కువ జంప్ చేసి రూ. 601.60కి చేరాయి. రెండవ వరుస సెషన్కు ఎగువ సర్క్యూట్ను తాకి 5,500 కోట్ల కంటే ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ను సాధించింది. స్క్రిప్ సోమవారం రోజుకి 20 శాతం పెరిగి రూ.546.95 వద్ద స్థిరపడింది. కంపెనీకి సంబంధించిన సర్క్యూట్ ఫిల్టర్ను BSE సవరించింది.

హెరిటేజ్ ఫుడ్స్ 'ట్రూలీ గుడ్' బ్రాండ్ పేరుతో కొత్త శ్రేణి స్వచ్ఛమైన నెయ్యి లడ్డూలను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ఆధారిత ఆహార సంస్థ దాని అనుబంధ సంస్థ హెరిటేజ్ న్యూట్రివెట్ లిమిటెడ్ (HNL) ద్వారా పశువుల దాణా వ్యాపారంలో ఉనికిని కలిగి ఉంది. గత నెలలో, హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు 89 శాతానికి పైగా ర్యాలీ చేశాయి, అయితే కౌంటర్ గత ఏడాదిలో పెట్టుబడిదారుల సంపదను దాదాపు రెట్టింపు చేసింది. 2024 సంవత్సరంలో ఇప్పటివరకు స్టాక్ 150 శాతానికి పైగా పెరిగింది.
ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (టిడిపి) అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి కొత్త ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని స్పష్టంగా తెలియడంతో హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు దలాల్ స్ట్రీట్లోని పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మార్చి త్రైమాసికం చివరి నాటికి ప్రమోటర్ వాటా 41.30 శాతంగా ఉన్న హెరిటేజ్ ఫుడ్స్లో కీలక వాటాదారుగా చంద్రబాబు నాయుడు భార్య నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. మార్చి త్రైమాసికం చివరి నాటికి ఆమె హెరిటేజ్ ఫుడ్స్లో 2,26,11,525 షేర్లు లేదా 24.37 శాతం వాటాను కలిగి ఉన్నారు. స్టాక్ పనితీరు బట్టి కొనుగోలు చేయాలి. అంతే తప్ప ఫోమోలో పడి స్టాక్స్ కొనకూడదని నిపుణులు చెబుతున్నారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications