చంద్రన్న పగ.. చంద్రన్న దగా: ఏపీలో అమలులో ఉన్న పథకాలు ఇవే
Roja: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి రోజా ఘాటు విమర్శలు సంధించారు.
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణితో కలిసి విలేకరులతో మాట్లాడారు.

ఎన్నికలకు ముందు ఆకర్షణీయమైన హామీలతో మహిళలను నమ్మించిన చంద్రబాబు- పవన్ కల్యాణ్ అధికారంలోకి రాగానే మొండిచేయి చూపారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంలో మహిళలు నరకాన్ని అనుభవిస్తోన్నారని, ఏ మాత్రం సంతోషంగా లేరని చెప్పారు. మహిళలపై అఘాయిత్యాలు, వేధింపులు సాధారణం అయ్యాయని, వారంతా భయం, భయంగా బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళా భద్రత కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశా యాప్, దిశా పోలీస్ స్టేషన్లు, మహిళా పోలీసులను తీసుకు వచ్చారని, చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వం వీటిని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. చంద్రబాబు, పవన్, హోంమంత్రి వంగలపూడి అనితకు మహిళలు అంటే కనీస గౌరవాభిమానాలు లేవని అన్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత రాష్ట్రంలో చంద్రన్న పగ, చంద్రన్న దగా, చంద్రన్న మోసం, తల్లికి పంగనామం, నిరుద్యోగులకు వెన్నుపోటు.. వంటి పథకాల పాలనను సాగుతోందని రోజా ఎద్దేవా చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరూ ఈ ప్రభుత్వం మహిళలకు మంచిని పంచేది కాదు, ముంచే ప్రభుత్వం అని విమర్శిస్తోన్నారని గుర్తు చేశారు.
కూటమ ప్రభుత్వానికి ఓట్లు వేసిన మహిళలకు కూడా చంద్రబాబు- పవన్ కల్యాణ్ ఏ పనీ చేయట్లేదని మండిపడ్డారు రోజా. మహిళా సాధికారిత కోసం ఎంతో కృషి చేసినట్లు ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసుకుంటోందని, రాష్ట్రంలో సగటున 70 మంది మహిళలు, వృద్దులు, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని, ఇదేనా మహిళా సాధికారిత అంటే? అంటూ నిలదీశారు.
మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఎత్తేశారు. ఆరేళ్ల బాలిక నుంచి 60 ఏళ్ల మహిళ చంద్రబాబు-పవన్ కల్యాణ్ ప్రభుత్వం అందరినీ మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో దాదాపుగా 50,000కు పైగా బెల్ట్ షాప్ లు పెట్టి, ఆడవారి పసుపు కుంకుమలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు.
జగన్ కంటే ఎక్కువ మేలు చేస్తామంటూ హామీలు ఇచ్చి చంద్రబాబు- పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చారని, సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించి, వాటిని ఎగ్గొడుతున్నారని వరుదు కల్యాణి విమర్శించారు. ఈ ప్రభుత్వం మహిళలను నిలువునా నట్టేట ముంచిందని, మహాశక్తి పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం చేశారని, ఇప్పటి వరకు ఒక్క మహిళకు కూడా ఈ పథకం కింద మేలు జరగలేదని గుర్తు చేశారు.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications