భారతి పేరు ఉండటాన్ని ఖండించలేదే? టీడీపీకేం సంబంధం?: జగన్కు యనమల కౌంటర్
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తన సతీమణి పేరు ఈడీ ఛార్జీషీటులో రావడంపై శుక్రవారం ప్రజలకు బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కౌంటర్ ఇచ్చారు.
మంత్రి యనమల శనివారం మాట్లాడుతూ.. ఈడీ కేసు విషయంలో జగన్ వాదన విచిత్రంగా ఉందని అన్నారు. ఈడీ ఛార్జీ షీటు కేసులో కుటుంబ ప్రమేయం ఉందో లేదో జగన్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

అవినీతి చేయలేదని చెప్పలేని జగన్..
అవినీతి చేయలేదని చెప్పలేని జగన్.. వార్తలపై మాత్రం అభ్యంతరం ఎలా చెబుతారని మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. జగన్ లేఖ ద్వారా ఆయన కుటుంబ ప్రమేయం ఉందని తేలిందన్నారు.

టీడీపీకేం సంబంధముంది?..
ఈడీ ఛార్జీ సీటు కేసులో టీడీపీకి సంబంధం ఏముంటుందని యనమల ప్రశ్నించారు. ఈడీ కేసు ద్వారా సానుభూతి పొందేయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ టీడీపీని నిందించాల్సిన అవసరం లేదని అన్నారు. ఈడీలోని ఇద్దరు అధికారులు సహాయం చేశారనడం సరికాదన్నారు.

భారతి పేరు ఉండటాన్ని ఖండించలేదే?
జగన్ వైఖరితోనే ఆయన కుటుంబసభ్యులు ఇబ్బంది పడే పరిస్థితి వస్తోందని యనమల రామకృష్ణుడు అన్నారు. ఈడీ కేసులో భారతీ పేరు ఉండటాన్ని జగన్ ఎక్కడా ఖండించలేదని అన్నారు. మీడియా లేనిది ఉన్నట్లుగా రాస్తే తప్పుపట్టాలి కానీ, ఉన్నది రాస్తే ఎందుకని ప్రశ్నించారు.

ఆమె పేరుందని జగన్ అడ్వకేట్లే..
ఈడీ కేసులో ఆమె పేరుందని జగన్ అడ్వకేట్లే చెబుతున్నారని అన్నారు.జగన్ మనీలాండరింగ్ కేసులో సీబీఐ కేసు నమోదైందని, ఇప్పుడు ఈడీ కూడా దర్యాప్తు చేస్తోందని యనమల చెప్పారు. ఇప్పటికే రూ. 43వేల కోట్లను అటాచ్ కూడా చేశారని తెలిపారు.కోట్ల అటాచ్ మెంట్ కూడా అయ్యాయి.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications