వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఎన్టీఆర్ మనవడినని తెలియనీయలేదు, హరికృష్ణకు లోటు'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Yarlagadda says about Janakiram
హైదరాబాద్: నందమూరి జానకిరాం మంచితనం మూర్తీభవించిన కుర్రాడని కేంద్రీయ హిందీ సంస్థాన్ ఉపాధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జానకిరాంకు ఆయన ఆదివారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

ఏడాది పాటు తమ ఇంటిలో ఉండి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడని గుర్తు చేశారు. ఎన్టీఆర్ మనవడినని ఎవరికీ ఆయన తెలియనీయలేదని చెప్పారు. జానకిరాం మరణం హరికృష్ణకు తీరని లోటు అన్నారు. పుత్రశోకం బాధ తనకు తెలుసునని బాబుమోహన్ అన్నారు.

కాగా, జానకిరాం మృతి నేపథ్యంలో హరికృష్ణను, ఆయన కుటుంబ సభ్యులను పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఓదార్చారు. వైయస్ జగన్, చిరంజీవి, కొడాలి నాని, పవన్ కల్యాణ్, దగ్గుబాటి సురేష్ బాబు, చిరంజీవి, జగపతి బాబు, కోట శ్రీనివాస రావు, బాబు మోహన్, జీవిత, జయకృష్ణ, లక్ష్మీపార్వతి తదితరులు నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.

జానకిరాంకు నివాళులు అర్పించిన అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో జానకిరాం మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. జానకిరాం ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. కారు డ్రెవ్‌ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ సీటు బెల్టు ధరిస్తే ఇలాంటి అవాంతరాలు జరుగకుండా కొంతమేరకు తప్పించుకునే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా చిరంజీవి విన్నవించారు.

English summary
Yarlagadda Laxmiprasad says about Janakiram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X