'ఎన్టీఆర్ మనవడినని తెలియనీయలేదు, హరికృష్ణకు లోటు'
ఏడాది పాటు తమ ఇంటిలో ఉండి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడని గుర్తు చేశారు. ఎన్టీఆర్ మనవడినని ఎవరికీ ఆయన తెలియనీయలేదని చెప్పారు. జానకిరాం మరణం హరికృష్ణకు తీరని లోటు అన్నారు. పుత్రశోకం బాధ తనకు తెలుసునని బాబుమోహన్ అన్నారు.
కాగా, జానకిరాం మృతి నేపథ్యంలో హరికృష్ణను, ఆయన కుటుంబ సభ్యులను పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఓదార్చారు. వైయస్ జగన్, చిరంజీవి, కొడాలి నాని, పవన్ కల్యాణ్, దగ్గుబాటి సురేష్ బాబు, చిరంజీవి, జగపతి బాబు, కోట శ్రీనివాస రావు, బాబు మోహన్, జీవిత, జయకృష్ణ, లక్ష్మీపార్వతి తదితరులు నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.
జానకిరాంకు నివాళులు అర్పించిన అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో జానకిరాం మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. జానకిరాం ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. కారు డ్రెవ్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ సీటు బెల్టు ధరిస్తే ఇలాంటి అవాంతరాలు జరుగకుండా కొంతమేరకు తప్పించుకునే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా చిరంజీవి విన్నవించారు.