వైసీపీ రంగుల కేసు .. 4 వేల కోట్ల ఖర్చు లెక్కలు చెప్పండన్న కోర్టు , విచారణ వాయిదా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేసి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్న అంశంపై ఏపీలో పెద్ద యుద్ధమే జరిగింది. ప్రభుత్వ కార్యాలయాలకు వైసిపి రంగులు అంశంపై ఏకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వైసీపీ రంగుల కోసం, దుర్వినియోగం చేసిన ప్రజాధనాన్ని వైసిపి నుండి , మంత్రుల నుండి రికవరీ చేయాలని డాక్టర్ శైలజ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు వైసిపి రంగులు వేయడానికి నాలుగు వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయినట్లుగా పేర్కొన్న డాక్టర్ శైలజ వైసిపి మంత్రులు, సంబంధిత అధికారుల నుండి వసూలు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు.

వైసీపీ రంగులు , నిధుల దుర్వినియోగంపై కోర్టులో వాదనలు
ఈ పిటిషన్ విచారించిన కోర్టు నాలుగు వేల కోట్ల రూపాయలు ఎలా ఖర్చు అయిందో తెలపాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగుల విషయంలో దాఖలు చేసిన పిటిషన్ పై పిటిషనర్ తరఫున అడ్వకేట్ డిఎస్ ఎన్ వి ప్రసాద్ బాబు వాదనలు వినిపించారు. ఈ కేసులో కోర్టు తీర్పు వచ్చేవరకు మాజీ సీఎస్ నీలం సాహ్ని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆపాలని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, మంత్రుల నుండి బ్యాంకు గ్యారెంటీ తీసుకోవాలని పిటిషనర్ కోరారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంపై కోర్టు సీరియస్ గా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.

నాలుగు వేల కోట్ల రూపాయలు ఎలా ఖర్చు చేశారో తెలపాలని ప్రభుత్వానికి ఆదేశం
ఈ వ్యవహారంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కోర్టు నాలుగు వేల కోట్ల రూపాయలు ఎలా ఖర్చు చేశారో తెలపాలని పేర్కొంది . తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భవనాలకు రంగులు వేయటం పెద్ద వివాదానికి కారణం అయ్యింది. అయితే ఆ రంగులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలోని రంగులు అంటూ ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పించారు . కోర్టు మెట్లు ఎక్కారు.

పార్టీ రంగులు తొలగించాలని గతంలోనే హైకోర్టు ఆదేశం .. ఏపీలో వైసీపీ రంగుల దుమారం
ఆ తర్వాత హైకోర్టు ప్రభుత్వ పంచాయతీ భవనాలకు ఉన్న రంగులను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు ఝలక్ ఇచ్చింది . రాష్ట్రంలోని పంచాయతీ కార్యాలయాలకు వేసిన వైసీపీ రంగులను తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులను వేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై పంచాయతీ కార్యాలయాలు ప్రభుత్వానివని, వాటికి పార్టీ రంగులు ఉండకూడదని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. దీంతో మళ్ళీ రంగులు మార్చాల్సి వచ్చింది . ఇదంతా ప్రజాధనం దుర్వినియోగం అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఏకంగా పలువురు కోర్టులో పిటిషన్లు దాఖలు చేసి, ఆ డబ్బులు వసూలు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేస్తున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications