చంద్రబాబు, భువనేశ్వరి కోడ్ ఉల్లంఘన - సీఈఓ కి వైసీపీ ఫిర్యాదు..!!
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయం కొత్త మలుపు తీసుకుంటుంది. విశాఖలో సిబిఐ పట్టుకున్న డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు రాజకీయ దుమారం గా మారుతుంది. ఇందులో వైసీపీ నేతలే ఉన్నారంటూ టిడిపి విమర్శలు గుప్పిస్తుంది. దీనికి వైసిపి నేతలు కౌంటర్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం పైనే వైసిపి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో టిడిపి అధినేత చంద్రబాబు, లోకేష్ పై విచారణ జరపాలని వైసిపి నేత పేర్ని నాని డిమాండ్ చేశారు. విశాఖ డ్రగ్ వ్యవహారంలో చంద్రబాబు,లోకేష్,పురందేశ్వరి, టిడిపి ముఖ్యుల పాత్రపై సీఈఓ కి ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో అసాంఘిక శక్తులను ప్రోత్సహించడానికి టిడిపి నేతలు ఈ డ్రగ్స్ తెప్పించే ప్రయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబు అవాస్తవాలతో వైసిపి పై చేసిన ట్వీట్ ను తమ ఫిర్యాదులో జత చేశారు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. లోతుగా విచారణ జరపాలని అభ్యర్థించారు.

సిబిఐ 25 వేల కిలోల మత్తు పదార్థాలను పట్టుకుందని, ఇందులో లావాదేవీలు జరిపిన సంస్థలు ఎవరో తెలియకుండానే చంద్రబాబు తమ పార్టీపై విషయం చెప్పారని నాని ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబు, పురందేశ్వరి బంధువులే డ్రగ్సు వ్యవహారంలో ఉన్నారని ఆరోపించారు. గతంలో చంద్రబాబు అమరావతికి సింగపూర్ మంత్రిని తెచ్చారని ఆ మంత్రి సింగపూర్ జైల్లో ఉన్నారని గుర్తు చేశారు. చంద్రబాబు రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారి పోతారని విమర్శించారు. కోడు ఉన్న సమయంలో నిరాధార ఆరోపణలు చేయడం కూడా ఉల్లంఘన కిందికే వస్తుందని పేర్ని నాని వివరించారు.
తప్పుడు ఆరోపణలు చేస్తే చర్యలు తీసుకోవాలని ఈసీ నిబంధనలు చెబుతున్నాయని స్పష్టం చేశారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఎన్నికల కోడ్ ముల్లంగించారని ఫిర్యాదు చేశారు. భువనేశ్వరి కోడ్ ఉన్న సమయంలో చెక్కులు పంపిణీ చేశారని, దీని మీద చర్యలు తీసుకోవాలని సూచించారు. తాము ఇప్పటికే ఈ అంశంపై సమాచారం సేకరిస్తున్నామని తగిన విధంగా స్పందిస్తామని సీఈవో వైసీపీ నేతలకు హామీ ఇచ్చారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications