పెద్దిరెడ్డి అడ్డాలో నందమూరి ఎంట్రీ, వైసీపీ లీడర్స్ జంప్ జిలాని, పోలింగ్ ముందు పగిలింది !
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వాన్ని అడ్రస్ లేకండా చెయ్యాలని తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని, జెండాలు వేరు అయినా అజెండా మాత్రం ఒక్కటే అని నందమూరి రామకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్, ఆయన సహచరుల ఆగడాలు ఎక్కువ అయ్యాయని, వైసీపీ ప్రభుత్వం తీరుతో ప్రజలు విసిగిపోయారని, మార్పు కోసం ఎదురు చూస్తున్నారని నందమూరి రామకృష్ణ చెప్పారు.
చిత్తూరు జిల్లాలోని తవణంపల్లె, అరగొండ ప్రాంతంల్లో వైసీపీకి బలమైన నాయకులు ఉన్నారు. అయితే నందమూరి రామకృష్ణ ఎంట్రీ ఇవ్వడంతో ఆ ప్రాంతంలో రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. తవణంపల్లె, అరగొండకు చెందిన వైసీపీ నాయకులు విజయ్ యాదవ్, రంజిత్ కుమార్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులు ఇంతకాలం జగన్ కోసం పని చేశారు.

అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల పోలింగ్ కు నాలుగు రోజుల ముందుగా రంజిత్ కుమార్ రెడ్డి, విజయ్ యాదవ్ తో పాటు వారి కుటుంబ సభ్యులు, అనుచరులు నందమూరి రామకృష్ణ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. వైసీపీ నాయకులు అందరికి తెలుగుదేశం కండువాలు కప్పిన నందమూరి రామకృష్ణ వారిని టీడీపీలో ఆహ్వానించారు. ఇద్దరు నాయకులు టీడీపీలో చేరుతున్న సందర్బంగా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ సందర్బంగా నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ కూటమి జెండాలు వేరు అయినా అజెండా మాత్రం ఒక్కటే అని, ఆంధ్రప్రదేశ్ లోని ప్రజల కష్టాలు తీర్చడానికి మూడు పార్టీల నాయకులు ఒక్కటి అయ్యారని, కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుతీరుతుందని, అందులో ఎలాంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ అరాచకాలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు.
రంజిత్ కుమార్ రెడ్డి, విజయ్ యాదవ్ తో పాటు వారి బంధువులు, వందలాది మంది అనుచరులు తెలుగుదేశంలో చేరడంతో కూటమికి మరింత బలం వచ్చిందని నందమూరి రామకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా నందమూరి రామకృష్ణతో కలిసి అందరూ భారీ ర్యాలీ నిర్వహించారు. వైసీపీకి చెందిన పలువురు నాయకులు తెలుగుదేశంలో చేరడానికి సిద్దంగా ఉన్నారని నందమూరి రామకృష్ణ అన్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications