ప్యాకేజీ కాదది కుళ్లిపోయిన క్యాబేజీ: రోజా సంచలన వ్యాఖ్యలు
అమరావతి: కుళ్లిన క్యాబేజీలాంటి ప్యాకేజీని ఏపీకి కేంద్రం ప్రకటించి రాష్ట్రానికి మనుగడ లేకుండా చేసిందని వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. సోమవారం చిత్తూరు జిల్లా కాణిపాకంలో ఆమె మీడియాతో విలేకరులతో మాట్లాడారు.

నెల్లూరుకు చెందిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, చిత్తూరుకు చెందిన సీఎం చంద్రబాబు నాయుడు హోదాకు అడ్డుగా ఉన్నారని ఆమె ఆరోపించారు. కేంద్రంలో అధికారంలోకి రాకముందు పదేళ్లు హోదా కావాలన్న వెంకయ్య ఇప్పుడు హోదా ఊసే ఎత్తడం లేదని ధ్వజమెత్తారు.
ఇక తాము అధికారంలోకి వస్తే ప్రత్యేకహోదా సాధించి తీరుతామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడో హోదా సంజీవని కాదని చెబుతున్నారని అన్నారు. ప్యాకేజీలకు ఆశపడి ఏపీకి ప్రత్యేకహోదాను అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించారు. వారిద్దరికీ మంచి బుద్ధి ప్రసాదించాలని కాణిపాకం వినాయక స్వామివారిని కోరుకున్నట్లు ఆమె తెలిపారు.
ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయని, తద్వారా నిరుద్యోగులకు ఉద్యోగావకశాలు లభిస్తాయని అన్నారు. ఇక పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రత్యేక హోదా అన్నవారు ఇప్పుడు అవసరంలేనట్టు ప్రవర్తించడం సరికాదని అన్నారు. ఇప్పటికైనా కేంద్రం ఏపీకి హోదా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
-
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు












Click it and Unblock the Notifications