వైసీపీ మహిళా ఎమ్మెల్సీ హఠాన్మరణం - ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి ..!!
ఏపీ శాసనమండలి సభ్యురాలు ఎండీ కరీమున్నిసా గుండెపోటుతో శుక్రవారం అర్థరాత్రి మృతి చెందారు. కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ ఎండీ కరీమున్నిసా శుక్రవారం సైతం మండలి సమావేశానికి హాజరయ్యారు. ఆ తరువాత ఇంటికి వచ్చిన ఆమె రాత్రి 11.30 గంటల సమయంలో ఛాతిలో నొప్పి వస్తోందని చెప్పడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రెండు హాస్పటల్స్కు తరలించినా ఫలితం లేకపోయింది. వారం రోజులుగా స్వల్ప అస్వస్థతతో ఉన్న ఆమెకు శుక్రవారంరాత్రి గుండెలో నొప్పి రావడంతో తనయుడు రుహుల్లా హుటాహుటిన అస్పత్రికి తరలించారు.

సిట్టింగ్ ఎమ్మెల్సీ కన్నుమూత
అస్పత్రిలో చేరిన కొద్దిసేపటికే ఆమె తుదిశ్వాస విడిచారు. భౌతిక కాయాన్ని అస్పత్రి నుంచి ఇంటికి తరిలించారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి కరీమున్నీసా పార్టీకోసం నిరంతరం శ్రమించారు. ఈ ఏడాది ఎమ్మెల్సీగా ఆమెకు సీఎం జగన్ అవకాశం కల్పించారు. శుక్రవారం ఉదయం శాసనమండలిలో ఆమె సీఎం జగన్, శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజును కలిశారు. కరీమున్నీసాకు భర్త, ఐదుగురు కుమారులు ఉన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మహ్మద్ కరీమున్నీసా గారి హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఉదయం సమావేశాలకు హాజరై..రాత్రికి తుది శ్వాస
శుక్రవారం ఉదయం శాసన మండలి సమావేశాలకు హాజరైన ఆమె రాత్రి అస్వస్థతకు గురి కావడం, గుండె పోటుతో మరణించడం పట్ల ముఖ్యమంత్రి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. విజయవాడలో ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన ప్రతిభావంతమైన నాయకురాలిగా, కార్పొరేటర్ నుంచి మండలి సభ్యురాలిగా ఎదిగిన కరీమున్నీసా మరణం ఊహించనిదని అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Recommended Video

ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి
అసెంబ్లీలో సైతం జగన్ తమ ప్రభుత్వం మహిళా సాధికారిత చర్చలో భాగంగా ఇద్దరు మైనార్టీ మహిళలకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించాలమని చెప్పుకొచ్చారు. అందులో కరీమున్సీసా ఒకరు. అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న కరీమున్నీసా పార్టీ పట్ల విధేయతతో ఉండేవారు. ఎమ్మెల్సీ కరీమున్సీసా మరణం తెలుసుకున్న జిల్లాకు చెందిన మంత్రులు... పలువురు ప్రజా ప్రతినిధులు నివాళి అర్పించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications