Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైసీపీ మహిళా ఎమ్మెల్సీ హఠాన్మరణం - ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి ..!!

ఏపీ శాసనమండలి సభ్యురాలు ఎండీ కరీమున్నిసా గుండెపోటుతో శుక్రవారం అర్థరాత్రి మృతి చెందారు. కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ ఎండీ కరీమున్నిసా శుక్రవారం సైతం మండలి సమావేశానికి హాజరయ్యారు. ఆ తరువాత ఇంటికి వచ్చిన ఆమె రాత్రి 11.30 గంటల సమయంలో ఛాతిలో నొప్పి వస్తోందని చెప్పడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రెండు హాస్పటల్స్‌కు తరలించినా ఫలితం లేకపోయింది. వారం రోజులుగా స్వల్ప అస్వస్థతతో ఉన్న ఆమెకు శుక్రవారంరాత్రి గుండెలో నొప్పి రావడంతో తనయుడు రుహుల్లా హుటాహుటిన అస్పత్రికి తరలించారు.

సిట్టింగ్ ఎమ్మెల్సీ కన్నుమూత

సిట్టింగ్ ఎమ్మెల్సీ కన్నుమూత


అస్పత్రిలో చేరిన కొద్దిసేపటికే ఆమె తుదిశ్వాస విడిచారు. భౌతిక కాయాన్ని అస్పత్రి నుంచి ఇంటికి తరిలించారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి కరీమున్నీసా పార్టీకోసం నిరంతరం శ్రమించారు. ఈ ఏడాది ఎమ్మెల్సీగా ఆమెకు సీఎం జగన్‌ అవకాశం కల్పించారు. శుక్రవారం ఉదయం శాసనమండలిలో ఆమె సీఎం జగన్‌, శాసనమండలి చైర్మన్‌ మోషేన్‌ రాజును కలిశారు. కరీమున్నీసాకు భర్త, ఐదుగురు కుమారులు ఉన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మహ్మద్ కరీమున్నీసా గారి హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఉదయం సమావేశాలకు హాజరై..రాత్రికి తుది శ్వాస

ఉదయం సమావేశాలకు హాజరై..రాత్రికి తుది శ్వాస

శుక్రవారం ఉదయం శాసన మండలి సమావేశాలకు హాజరైన ఆమె రాత్రి అస్వస్థతకు గురి కావడం, గుండె పోటుతో మరణించడం పట్ల ముఖ్యమంత్రి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. విజయవాడలో ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన ప్రతిభావంతమైన నాయకురాలిగా, కార్పొరేటర్ నుంచి మండలి సభ్యురాలిగా ఎదిగిన కరీమున్నీసా మరణం ఊహించనిదని అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Recommended Video

    Chandrababu Crying ప్రెస్ మీట్లోనే ఏడ్చేసిన చంద్రబాబు CBN Challenge In AP Assembly | Oneindia Telugu
    ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి

    ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి

    అసెంబ్లీలో సైతం జగన్ తమ ప్రభుత్వం మహిళా సాధికారిత చర్చలో భాగంగా ఇద్దరు మైనార్టీ మహిళలకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించాలమని చెప్పుకొచ్చారు. అందులో కరీమున్సీసా ఒకరు. అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న కరీమున్నీసా పార్టీ పట్ల విధేయతతో ఉండేవారు. ఎమ్మెల్సీ కరీమున్సీసా మరణం తెలుసుకున్న జిల్లాకు చెందిన మంత్రులు... పలువురు ప్రజా ప్రతినిధులు నివాళి అర్పించారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+