Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రకాశం బ్యారేజ్ బోట్ల ఘటనలో బిగ్ ట్విస్ట్..షాకింగ్ వీడియో లీక్

ఇటీవల విజయవాడలోని కృష్ణ నదిపై ఉన్న ప్రకాశం బ్యారేజీకి భారీ వరద వచ్చింది. దీంతో పూర్తి స్థాయిలో గేట్లను ఎత్తిన అధికారులు ప్రవాహాన్ని సముద్రంలోకి వదిలారు. ఈ సమయంలో వరదలో కొట్టుకొచ్చిన భారీ బోట్లు ప్రకాశం బ్యారేజీ లోని 67, 68, 69 వ గేట్లకు బలంగా ఢీ కొట్టాయి. దీంతో గేట్ల కౌంటర్ వేయిట్ పిల్లర్లు డ్యామేజ్ అయ్యాయి. AP-IV-M-SB-0017, AP-IV-M-SB-0022, AP-IV-M-SB-0023 నెంబర్లు గల బోట్లు.. ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయి. ఈ ఘటనలో బ్యారేజీలోని 67, 69, 70 గేట్లు దెబ్బతిన్నాయి.

దీంతో ఆ గేట్లకు కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ బోట్లకు వైసీపీ రంగులు వేసి ఉండటంతో ఇది ఆ పార్టీ నేతల పనే అని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఆ మూడు బోట్లు వైసీపీకి చెందిన వారివే అని మంత్రులు సైతం ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్సీ తలశిల రఘురాంలకు బోట్ల యజమాని ఉషాద్రి రామ్మోహన్ సన్నిహితుడని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే దీనిపై వైసీపీ నాయకుల వాదన మరోలా ఉంది.ఆ బోట్ల యజమాని...మంత్రి నారా లోకేష్ సన్నిహితుడని వైసీపీ నాయకులు చెబుతున్నారు.

ycp video released on Boats hit the Prakasam barrage controversy

ఈ కేసులో నిందితుడు కోమటి రామ్మోహన్, ఉషాద్రిలను పోలీసులు అరెస్ట్ చేశారని, అందులో రామ్మోహన్...టీడీపీ ఎన్నారై అధ్యక్షుడు కోమటి జయరాం బంధువని ఆరోపిస్తోంది. గతంలో లోకేష్‌తో కలిసి ఉషాద్రి దిగిన ఫొటోలను వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నిందితులకు లోకేష్‌తో సంబంధాలున్నాయనడానికి ఈ ఫొటోలే సాక్ష్యమని చెబుతోంది. వరద బాధితులంతా టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, దానిని తప్పుదోవ పట్టించేందుకే టీడీపీ ప్రయత్నిస్తోందని, అందుకే వైసీపీపై నిందలు వేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

తాజాగా ఓ బోట్లు టీడీపీ నాయకులకు చెందినవే అనడానికి సాక్ష్యాలను సైతం వైసీపీ బయటపెట్టింది. ఎన్నికల్లో గెలవగానే ఆ బోట్లలోనే టీడీపీ ర్యాలీ చేసిందని వైసీపీ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఎన్నికల్లో గెలవగానే ఆ బోట్లతో ర్యాలీ చేసి టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారని, అవే బోట్లు బ్యారేజ్ను ఢీకొన్నాయని తెలిపింది. అందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. అడ్డంగా దొరికినా సిగ్గులేకుండా వైసీపీపై నిందలా అని చంద్రబాబును ప్రశ్నించింది. ఇంతకంటే దిక్కుమాలినతనం ఉండదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. మరి దీనిపై టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+