ఏపీలో మరో యువతి మృతి..నిందితుడు టీడీపీ కార్యకర్తే..!
ఏపీలో మహిళలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో యువతి మరణించింది. మూడురోజుల కిందట నవీన్ అనే వ్యక్తి దాడి చేయడంతో మధిర సహాన అనే యువతి తీవ్రంగా గాయపడింది. ఈ దాడితో యువతి బ్రెయిన్ డెడ్ అయ్యింది. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితం మరణించింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మధిర సహాన ఆస్పత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తుంది. విధులు ముగించుకుని ఇంటికి వస్తోన్న సహానపై నవీన్ దాడి చేశాడు.ఈ దాడిలో అపస్మారక స్థితిలోకి వెళ్లిన సహానను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పిన నవీన్ అక్కడ నుంచి పరారయ్యాడు.మూడు రోజుల నుంచి వెంటిలేటర్పై మృత్యువుతో పోరాడిన సహాన మంగళవారం మరణించింది. అయితే నవీన్ టీడీపీ కార్యకర్త అని తెలుస్తోంది. నవీన్ ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత , సీఎం చంద్రబాబుతో దిగిన ఫొటోలు సైతం వైరల్ అవుతున్నాయి.

సహాన మరణంపై వైసీపీ మాజీ మంత్రి రోజా స్పందించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సహన మృతి చెందడంపై ఆమె విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్న జిల్లాలో, మహిళ హోంమంత్రి గా ఉన్న ఈ రాష్ట్రంలో టీడీపీ రౌడీ షీటర్ కిరాతకంగా దాడి చేసి సహానాను హత్య చెయ్యడం దారుణం. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్య. ఈ హత్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనితలే బాధ్యత వహించాలని రోజా డిమాండ్ చేశారు. మూడు రోజులుగా మృత్యువుతో పోరాడిన సహానకి మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి కానీ, హోంమంత్రి కానీ వెళ్లి వైద్యులను అదేశించకపోవడం దారుణమని ఆమె తెలిపారు.
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సహన మృతి చెందడం బాధాకరం. సాక్షాత్తు ముఖ్యమంత్రి @ncbn చంద్రబాబు ఉన్న జిల్లాలో, మహిళ హోంమంత్రి గా ఉన్న ఈ రాష్ట్రంలో టీడీపీ రౌడీ షీటర్ కిరాతకంగా దాడి చేసి సహానా ను హత్య చెయ్యడం దారుణం. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్య. ఈ హత్యకు…
— Roja Selvamani (@RojaSelvamaniRK) October 22, 2024
ఇంకా ఎంత మంది అడబిడ్డలను బలి తీసుకుంటారని ఆమె ప్రశ్నించారు. టీడీపీ నేతలు, రౌడీ షీటర్ల నుండి మహిళల మాన, ప్రాణాలను ముప్పు ఉంది. తక్షణమే సహానాను హత్య చేసిన టీడీపీ రౌడీ షీటర్ నవీన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు రోజా. రియాలిటీ షో కి వెళ్లి వినోదం పొందిన సీఎం చంద్రబాబు ఇప్పుడు సహాన తల్లి కన్నేటికి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.సహాన ఆత్మ శాంతించాలని భగవంతుడిని కోరుకుంటున్నానని మాజీ మంత్రి రోజా తెలిపారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications