జగన్తో చేతులు కలిపేందుకు పోటీ: విల్లుతో..(పిక్చర్స్)
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో ఓటుతో మన రాతలను మనమే మార్చుకుందామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన హైదరాబాద్లోని యూసుఫ్ గూడ్, ఖైరతాబాద్, కుత్బుల్లాపూర్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రానికే కాదు, దేశానికే చాటి చెప్పారని అన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైయస్ పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించారని గుర్తు చేశారు.
విద్యార్థుల ఉన్నత విద్య కోసం ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని జగన్ చెప్పారు. పేద ప్రజల కోసం వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.
పోటీపడిన యువకులు
సోమవారం వైయస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లోని యూసుఫ్ గూడ్, ఖైరతాబాద్, కుత్బుల్లాపూర్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్తో చేతులు కలిపేందుకు పోటీ పడుతున్న యువకులు.
తమ నేతకు టోపీ, విల్లు
వచ్చే ఎన్నికల్లో ఓటుతో మన రాతలను మనమే మార్చుకుందామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.
జగన్ అభివాదం
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రానికే కాదు, దేశానికే చాటి చెప్పారని అన్నారు.
స్తంభించిన ట్రాఫిక్
వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన రోడ్ షో సందర్భంగా స్తంభించిపోయిన ట్రాఫిక్. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైయస్ పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించారని జగన్ గుర్తు చేశారు. విద్యార్థుల ఉన్నత విద్య కోసం ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని జగన్ చెప్పారు