బాబుకు 57, వైయస్కు 96: జగన్, సాక్షి కాదు: టీడీపీ

తొమ్మిదేళ్ల బాబు హయాంలో 21,994 కోట్ల రెవెన్యూ లోటు రాష్ట్రానికి వచ్చిందన్నారు. కానీ, వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి మిగులు బడ్జెట్ వచ్చిందన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబుకు కేవలం 57 మార్కులే వచ్చాయని, కానీ, 2004 నుంచి 2009 మధ్య పాలనలో ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి అమోఘంగా 96 మార్కులు తెచ్చుకున్నారన్నారు. 2009-2014 మధ్య రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం 68 మార్కులు తెచ్చుకుందన్నారు.
జగన్లా పారిపోం: యనమల
జగన్ పైన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సెటైర్లు విసిరారు. సభలో వృద్ధిరేటు గురించి మాట్లాడుతున్న జగన్, అవినీతి రేటు, దోపిడీ రేటు గురించి కూడా మాట్లాడితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. జగన్ చెప్పేవన్నీ అసత్యపు లెక్కలన్నారు. చంద్రబాబు, వైయస్ పాలనల మధ్య వ్యత్యాసాలపై మాట్లాడటానికి సొంత లెక్కలు వద్దన్నారు. తాము జగన్ మాదిరి సభ నుంచి పారిపోయే వారం కాదని, జగన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతామన్నారు.
అచ్చెన్నాయుడు కౌంటర్
శ్వేతపత్రం అంటే ఉన్నది ఉన్నట్లు చెప్పేదని, శ్వేతపత్రం అంటే సాక్షి కాదని మంత్రి అచ్చెన్నాయుడు చురకలు అంటించారు. రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను భ్రష్టు పట్టించింది వైయస్సే అన్నారు. మూడు నెలల్లో విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు.
తప్పుడు లెక్కలు: కాల్వ
తప్పుడు లెక్కలతో జగన్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని కాల్వ శ్రీనివాసులు అన్నారు. 2004-2014 వరకు ఎంతో అభివృద్ధి చెందిందని జగన్ చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారని, నిజానికి అభివృద్ధి జరిగింది జగన్ ఆస్తుల పెంపులోనే అన్నారు.
భూమా, కోడెల మధ్య ఆసక్తికర చర్చ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభంకాగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగి రెడ్డి, స్పీకర్ కోడెల శివప్రసాద్ మధ్య ఆసక్తికర సంవాదం జరిగింది. స్పీకర్ కోడెల అంతకుముందు నవ్వుతూ పలకరించే వారని స్పీకర్ అయ్యాక కనీసం తమవైపు చూసి నవ్వడం లేదని ఎమ్మెల్యే అన్నారు. దీనిపై స్పీకర్ మాట్లాడుతూ సభ సజావుగా సాగడంలేదనే బాధ తప్ప మరో ఉద్దేశం లేదన్నారు.












Click it and Unblock the Notifications