లోకేష్ అవినీతిని మిథున్ అడ్డుకున్నారు, అందుకే కేసు: జగన్ షాకింగ్
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం తీవ్రంగా నిప్పులు చెరిగారు. ఆయన జైలులో ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డిలను పరామర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు డైరెక్షన్లో కుట్రలు సాగుతున్నాయని ఆరోపించారు. తమను రాజకీయంగా ఎదుర్కోలేని చంద్రబాబు అధికారాన్ని అడ్డం పెట్టుకుని దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఆయన ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు వైసిపి నేతలను అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు.

కేసుల పేరుతో తమ పార్టీ వారిని లక్ష్యంగా చేసుకుంటూ నీచమైన రాజకీయాలకు చంద్రబాబు ప్రభుత్వం పాల్పడుతోందన్నారు. నారా లోకేష్ చేస్తున్న అవినీతిని అడ్డుకున్న కారణంతోనే మిథున్ రెడ్డి పైన తప్పుడు కేసులు పెట్టారని ధ్వజమెత్తారు.
విమానాశ్రయంలో మిథున్ రెడ్డి తప్పు ఉంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. చంద్రబాబు డైరెక్షన్ మేరకే వైసిపి నేతల పైన కుట్రలు జరుగుతున్నాయన్నారు. టీడీపీ ఆగడాలను ప్రజా క్షేత్రంలో అడ్డుకుంటామన్నారు. చంద్రబాబుకు త్వరలో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications