జన్మదిన శుభాకాంక్షలు నాన్నా- వైఎస్సార్ జయంతి సందర్భంగా జగన్ ఎమోషనల్ ట్వీట్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసిన దివంగత వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయన అభిమానులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు, మంత్రులు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఇడుపుల పాయలోని వైఎస్సార్ ఘాట్ కు వెళ్లి ఆయన తనయుడు, సీఎం జగన్ నివాళులు అర్పించనున్నారు.
తన తండ్రి దివంగత వైఎస్సార్ జయంతి సందర్భంగా సీఎం జగన్ భావోద్వేగంతో కూడిన ట్వీట్ పెట్టారు. ఇందులో తండ్రి వైఎస్సార్ వారసుడిగా ఆయన నుంచి పుణికిపుచ్చుకున్న లక్షణాలను, ముఖ్యంగా వైఎస్సార్ అంటే గుర్తుకొచ్చే చెరగని చిరునవ్వును జగన్ గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ బాటలోనే తాను పాలన సాగిస్తున్నట్లు ఈ ట్వీట్ లో జగన్ తెలిపారు. దీంతో జగన్ ట్వీట్ బాగా వైరల్ అవుతోంది.

"చెదరని చిరునవ్వే నువ్వు పంచిన ఆయుధం. పోరాడే గుణమే నువు ఇచ్చిన బలం మాట తప్పని నైజం నువు నేర్పిన పాఠం. నీ ఆశయాలే నాకు వారసత్వం. ప్రజల ముఖాల్లో విరిసే సంతోషంలో నిను చూస్తున్నా.. పాలనలో ప్రతిక్షణం నీ అడుగుజాడను స్మరిస్తూనే ఉన్నా.. జన్మదిన శుభాకాంక్షలు నాన్నా... " అంటూ వైఎస్ జగన్ తన ట్వీట్ లో తన తండ్రి వైఎస్సార్ ను గుర్తు చేసుకున్నారు. ఆ విధంగా వైఎస్సార్ జయంతి రోజు జగన్ ఘనంగా నివాళులు అర్పించారు.
Recommended Video

-
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ!












Click it and Unblock the Notifications