వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత దారుణ హత్య: పరిటాల ఫ్యామిలీపై ఆరోపణలు
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కేశవరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఆత్మకూరుకు చెందిన కేశవరెడ్డిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేయడం స్థానికంగా కలకలం రేపింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..కేశవరెడ్డిపై రాడ్లతో మూకుమ్ముడిగా దాడి చేశారు. అయితే తీవ్రంగా గాయపడిన కేశవరెడ్డిని ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందారు.
మాజీ సర్పంచ్ అయిన కేశవరెడ్డిని పరిటాల కుటుంబమే హత్య చేయించిందని ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇరు కుటుంబాల మధ్య ఉన్న పాత కక్షల కారణంగానే పరిటాల వర్గీయులు కేశవరెడ్డిని హత్య చేశారని మండిపడుతున్నారు.
కిడారి, సోమలకు పట్టిన గతే: ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి మావోయిస్టుల స్ట్రాంగ్ వార్నింగ్
ఈ హత్య ఘటనలో మంత్రి సునీత సోదరడు ప్రమేయముందని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కేశవరెడ్డి భార్య రాజమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.