టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అటు కేంద్రం లోక్ సభ.. అసెంబ్లీ సీట్ల పెంపు పై సంచలన నిర్ణయం తీసుకుంది. ఎంపీ.. ఎమ్మెల్యే స్థానాలు 50 శాతం మేర పెరగటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో.. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటికే కూటమి- వైసీపీ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. 2024 లో ఓటమికి దారి తీసిన నిర్ణయాలను జగన్ దిద్దుబాటు మొదలు పెట్టారు. టీడీపీ కంచుకోటల్లో అభ్యర్ధులను ఖరారు చేస్తూ.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు.
మాజీ సీఎం జగన్ 2029 ఎన్నికలే లక్ష్యంగా నియోజకవర్గాల వారీగా నివేదికలు సేకరిస్తున్నారు. 2029 నాటికి అసెంబ్లీ - లోక్ సభ సీట్లు పెరిగే అవకాశం ఉండటంతో.. స్థానికంగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ ముందస్తుగానే అభ్యర్ధుల ఖరారు పైన ఫోకస్ చేసారు. అందులో భాగంగా టీడీపీ కంచుకోటగా ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ఆచి తూచి ఎంపిక చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో సామాజిక లెక్కల పేరుతో సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఇతర నియోజకవర్గాలకు బదిలీ చేసారు. ఈ నిర్ణయం బూమ్ రాంగ్ అయింది. భారీ నష్టాన్ని మిగుల్చింది. దీంతో, ఎమ్మెల్యేలను 2019 లో గెలిచిన సొంత నియోజకవర్గాలకు తిరిగి కేటాయిస్తున్నారు. 2011 జనాభా లెక్కల మేరకే నియోజకవర్గాల పునర్విభజన జరగనుండటంతో.. ఆ లెక్కల ఆధారంగా ముందస్తుగానే నేతలను పోటీకి సమాయత్తం చేసే విధంగా ప్రజల్లో ఉంచాలని డిసైడ్ అయ్యారు. తాజాగా రేపల్లె నియోజకవర్గం నుంచి కొత్త సమన్వయ కర్తను ఖరారు చేసారు.

రేపల్లెలో ఇప్పటి వరకు పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీ ఒక్క సారి కూడా గెలవలేదు. కాంగ్రెస్ తరువాత టీడీపీకి నియోజకవర్గం కంచుకోటగా మారింది. వైసీపీ ఏర్పాటు నుంచి 2019 వేవ్ లోనూ టీడీపీ నే గెలిచింది. అక్కడ ఇప్పుడు కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. 2029 ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో వైసీపీ ఇప్పటి నుంచే వ్యూహాలు అమలు చేస్తోంది. 2024 ఎన్నికల ముందు అప్పటి వరకు ఇంఛార్జ్ గా ఉన్న నేత ను తప్పించి కొత్త వారికి సీటు ఇచ్చింది. తిరిగి టీడీపీ నుంచి పోటీ చేసిన అనగాని సత్యప్రసాద్ -గెలిచి మంత్రి అయ్యారు. దీంతో, వచ్చే ఎన్నికల కోసం ముందస్తుగానే అక్కడ వైసీపీ కొత్త ఇంఛార్జ్ ను ప్రకటించింది. ఇక్కడ మోపిదేవి పార్టీకి 2024 వరకు పెద్ద దిక్కుగా ఉన్నారు. తరువాత ఆయన టీడీపీలో చేరారు. 2024 లో ఇక్కడ వైసీపీ గౌడ సామాజిక వర్గానికి చెందిన ఈపూరి గణేష్ ను గత ఎన్నికల్లో బరిలోకి దించారు. ఆ ఎన్నికల్లో గణేష్ ఓడిపోయారు. వరుస విజయాలతో టిడిపి బలం పెరగడంతో పాటు అనగాని సత్య ప్రసాద్ ను మంత్రి పదవి వరించింది. ఈ క్రమంలోనే గౌడ సామాజిక వర్గానికే చెందిన పీటా నాగ మోహన్ క్రిష్ణ వైపు మొగ్గు చూపింది.
నియోజకవర్గాల పునర్విభజన .. మారుతున్న లెక్కలు
నియోజకవర్గంలోని నగరం మండలం పీటా వారిపాలెం కు చెందిన మోహన్ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఆర్థికంగా బలమైన అభ్యర్ధి కావడంతో పాటు గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో అతని వైపు మొగ్గినట్లు తెలుస్తుంది. గౌడ, మత్స్యకార సామాజిక వర్గాలతో పాటు కాపులు రేపల్లేలో అత్యధికంగా ఉంటారు. అయితే రానున్న ఎన్నికల నాటికి నియోజకవర్గాల మార్పులు చేర్పులు జరిగితే రేపల్లే నియోజక వర్గంలో కూడా భారీగా మార్పులు ఖాయం. అయితే, రేపల్లే నియోజకవర్గం మాత్రం బిసిలకు పెట్టని కోటగా ఉంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే - మంత్రి పైన స్థానికంగా ఉన్న అభిప్రాయానికి అనుగుణంగా జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన పైన స్పష్టత వచ్చిన తరువాత జగన్ తన కార్యాచరణ వేగవంతం చేసే అవకాశం కనిపిస్తోంది.
-
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?














Click it and Unblock the Notifications