జగన్ని కల్సిన 2వరోజే షాక్: బాబు సమక్షంలో టీడీపీలోకి డేవిడ్రాజు
విజయవాడ: తెలుగుదేశం పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీలో చేరగా తాజాగా మరో ఎమ్మెల్యే కూడా టీడీపీ పుచ్చుకున్నారు.
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డేవిడ్రాజు ఆదివారం ఉదయం టిడిపి అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యారు. అనంతరం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.

ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళావెంకట్రావు, మంత్రి శిద్దా రాఘవరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, పార్టీ వీడనని చెప్పిన రెండో రోజే డేవిడ్ రాజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం గమనార్హం. దీంతో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల ఎమ్మెల్యేలతో సీరియస్గా చర్చించాలంటూ ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ వైయస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేతలను ఆదేశించారు.
కాగా, డేవిడ్ రాజు శుక్రవారం జగన్ను కలిశారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారవద్దని సూచించారు. జరిగి 48 గంటల్లోనే రాజు ఆదివారం సీఎం చంద్రబాబు నాయుడును కలిసి టీడీపీలోకి చేరటం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications