రఘురామపై వేటుపై వైసీపీ క్లారిటీ-స్పీకర్ నోటీసుల తర్వాత తొలిసారి- ఎప్పుడో తెలుసా ?
వైఎస్సార్సీపీ నుంచి గెలిచి ఆ పార్టీపైనే యుద్ధం చేస్తున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు పడుతుందా లేదా అంటూ సాగుతున్న ఊహాగానాలకు ఆ పార్టీ ఇవాళ మరోసారి క్లారిటీ ఇచ్చేసింది. గతంలో తాము ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా త్వరలో రఘురామపై అనర్హత వేటు తప్పదని ఆ పార్టీ ఎంపీ, లోక్ సభలో పార్టీ విప్ మార్గాని భరత్ స్పష్టం చేశారు. ఇప్పటికే లోక్ సభ స్పీకర్ ఇచ్చిన నోటీసులకు రఘురామ స్పందనపై సస్పెన్స్ కొనసాగుతున్న వేళ వైసీపీ స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది.

రఘురామపై అనర్హత వేటు
వైసీపీ తరఫున గెలిచి పార్టీ విధానాలకు వ్యతిరేకంగా నిత్యం వ్యాఖ్యలు చేస్తున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వేటు కోరుతూ వైసీపీ పార్లమెంటరీ పార్టీ ఇప్పటికే లోక్ సభ స్పీకర్ కు పలుమార్లు ఫిర్యాదులు చేసింది. పార్టీ విధానాల్ని ఉల్లంఘిస్తూ రఘురామ చేసిన వ్యాఖ్యలు, ఆయన వైఖరిపై తగు ఆధారాలను కూడా లోక్ సభ స్పీకర్ కు సమర్పించింది. అయినా చర్యలు లేకపోవడంతో తాజాగా ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకునేలా స్పీకర్ పై ఒత్తిడి పెంచింది. చివరికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని కోరుతూ రఘురామరాజుకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని కూడా సూచించారు.

రఘురామ స్పందనపై సస్పెన్స్
వైసీపీ ఇచ్చిన అనర్హత వేటు ఫిర్యాదుపై స్పందన తెలియజేసేందుకు రఘురామకృష్ణంరాజుకు లోక్ సభ స్పీకర్ ఇచ్చిన 15 రోజుల గడువు గత నెల 30నే ముగిసిపోయింది. దీంతో రఘురామరాజు సమాధానం ఇచ్చారా లేదా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. అటు రఘురామరాజు కానీ, ఇటు వైసీపీ కానీ ఇప్పటివరకూ దీనిపై స్పందించలేదు. లోక్ సభ స్పీకర్ కార్యాలయం సైతం రఘురామరాజు నుంచి వివరణ వచ్చిందో లేదో వెల్లడించలేదు. దీంతో ఈ వ్యవహారంలో ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. వీరిలో ఎవరో ఒకరు స్పందిస్తే తప్ప ఈ సస్పెన్స్ కు తెరపడే అవకాశం లేదని భావిస్తున్న తరుణంలో వైసీపీ నుంచి తొలి స్పందన వచ్చింది.

రఘురామపై వేటు ఖాయం
వైసీపీ తరఫున గెలిచి పార్టీ విధానాల్ని నిత్యం వ్యతిరేకిస్తున్న రఘురామకృష్ణంరాజుపై త్వరలో అనర్హత వేటు పడటం ఖాయమని ఆ పార్టీ ఎప్పటినుంచో చెబుతోంది. కానీ వైసీపీ అనుకున్నంత సులువుగా ఈ వేటు పడేలా కనిపించడం లేదు. దీంతో తాజాగా రఘురామకు నోటీసులు జారీ అయిన తర్వాత వైసీపీ స్పందన ఎలా ఉంటుందో తెలియక సస్పెన్స్ కొనసాగుతున్న వేళ ఆ పార్టీ ఎంపీ, లోక్ సభలో పార్టీ విప్ కూడా అయిన మార్గాని భరత్ మరోసారి స్పందించారు. రఘురామరాజుపై త్వరలో వేటు పడటం ఖాయమని తేల్చిచెప్పారు.
Recommended Video

స్పీకర్ పరిశీలనలో రఘురామపై వేటు
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఇచ్చిన నోటీసులకు రఘురామరాజు సమాధానం ఇచ్చారో లేదో తెలియక సస్పెన్స్ కొనసాగుతున్న వేళ తాజాగా దీనిపై స్పందించిన వైసీపీ ఎంపీ మార్గాని భరత్.. క్లారిటీ ఇఛ్చారు. ఈ వ్యవహారం ప్రస్తుతం స్పీకర్ పరిశీలనలో ఉందని, త్వరలో రఘురామపై వేటు పడటం ఖాయమని ఇవాళ తిరుమల వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. దీంతో రఘురామరాజుపై వేటుపై వైసీపీ లో ఏమాత్రం ధీమా సడలడం లేదని తేలిపోయింది. స్పీకర్ నోటీసులు జారీ చేసిన తర్వాత వెలువడిన వైసీపీ నుంచి వెలువడిన తొలి స్పందన కావడంతో ఢిల్లీ పరిణామాల్ని నిశితంగా గమనిస్తున్న వైసీపీ చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications