'చంద్రబాబు ఢిల్లీలో హేమమాలిని సహా బీజేపీ నేతలను ఎందుకు కలుస్తున్నారు'
న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా కోసం ఢిల్లీకి వచ్చానని చెబుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీజేపీ నేతలను ఎందుకు కలుస్తున్నారని వైసీపీ ఎంపీ వరప్రసాద్ బుధవారం ప్రశ్నించారు. హేమమాలిని తదితర బీజేపీ నేతలను కలిశారని చెప్పారు.
Recommended Video

ముఖ్యమంత్రిస్థాయి వ్యక్తి ఇంతలా దిగజారాలా:విజయ్ సాయి రెడ్డి
పార్లమెంటు నిరవధిక వాయిదా పడగానే తాము ఏపీ భవన్కు వెళ్లి ఆమరణ దీక్ష చేపడతామని తెలిపారు. హోదా ఏపీకి ఊపిరి వంటిది అన్నారు. ఊపిరి ఉన్నంత వరకు తాము హోదా కోసం పోరాటం చేస్తామని చెప్పారు. రాజీనామాలు చేయగానే ఏపీ భవన్ వెళ్లి ఆమరణ నిరాహార దీక్ష చేస్తామన్నారు.

నలభై ఏళ్లుగా చంద్రబాబు రాజకీయాల్లో ఉంటూ ఎవరో కొత్తగా పార్లమెంటులోకి వచ్చినట్లుగా నమస్కారం పెట్టడం, అదీ ఫోటోలకు ఫోజులు ఇస్తూ నమస్కరించడం విడ్డూరమని వరప్రసాద్ అన్నారు. వైసీపీ అవిశ్వాసం పెడితే మద్దతిస్తామని చెప్పిన చంద్రబాబు ఆ తర్వాత ఆయనే ప్రవేశ పెట్టారన్నారు.












Click it and Unblock the Notifications