Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Palnadu: పల్నాడులో ఆగని దాడుల పర్వం-ఎంపీ లావు, అంబటి అల్లుడి కార్ల ధ్వంసం..!

ఏపీలోని పల్నాడు ప్రాంతంలో ఎన్నికల హింస చెలరేగింది. ఉదయం నుంచి చెదురుమదురు ఘటనలతో ప్రారంభమైన పోలింగ్.. మధ్యాహ్నం కల్లా దాడులకు దారి తీసింది. ముఖ్యంగా వైసీపీ వర్సెస్ కూటమిగా సాగుతున్న ఈ పోరులో నేతలు పరస్పరం దాడులకు దిగడం, ఆస్తుల విధ్వంసం కూడా చోటు చేసుకుంటున్నాయి. పోలీసుల సాయంతో ఈసీ వీటిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నా అదుపులోకి రావడం లేదు.

మాచర్లలో కూటమి తరఫున పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్ధి బ్రహ్మానందరెడ్డి కారును ఉదయం ప్రత్యర్థులు ధ్వంసం చేసారు. అనంతరం నరసరావుపేట కూటమి ఎంపీ అభ్యర్ధి లావు శ్రీకృష్ణదేవరాయలు కారును కూడా ధ్వంసం చేశారు. మరోవైపు మంత్రి అంబటి రాంబాబు అల్లుడు ఉపేష్ కారుతో పాటు మరో జనసేన నేత కార్లు కూడా ఈ దాడుల్లో ధ్వంసం అయ్యాయి. దీంతో పలు చోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకుంటున్నాయి.

ysrcp versus opposition violence continues in palnadu district as cars damaged leaders attacked


నరసరావుపేట మండలం దొండపాడు గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లిన పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలుపై దాడికి ప్రత్యర్దులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆయన కారుతో పాటు మరో మూడు కార్లు ధ్వంసం చేశారు. ఈ ఘటన నుంచి లావు సురక్షితంగా తప్పించుకున్నట్లు తెలుస్తోంది. అటు పల్నాడు జిల్లా గురజాలలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇరు పార్టీలకు చెందిన పలువురికి గాయాలు అయ్యాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+