రోజాపై టీడీపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు : ఎస్పీకి చేరిన పంచాయితీ
మాజీ మంత్రి ఆర్.కె. రోజాపై నగరి శాసనసభ్యుడు గాలి భాను ప్రకాష్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. గతంలో నగరి సీఐకి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు లేకపోవడంతో, ఈ వ్యవహారం మరింత వేడెక్కింది.
మహిళా నాయకుల ఆవేదన
ఈ నేపథ్యంలో, ఈ రోజు నగరి నియోజకవర్గానికి చెందిన మహిళా ప్రతినిధులు చిత్తూరు జిల్లా పోలీసు అధికారి గౌరవనీయులు ఎస్పీమణికంఠ కలిశారు. మాజీ మంత్రి రోజా తరపున ఆయనకు వినతిపత్రం సమర్పించి, తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళా నాయకురాలిపై ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయడం సమాజంలో మహిళల గౌరవాన్ని నిందించడమే. ఇది కేవలం వ్యక్తిగత దాడి కాదు, మహిళలందరిపై జరిగిన దాడిగా భావించాలని వారు తీవ్రంగా ఖండించారు.

తక్షణ చర్యలకు డిమాండ్
గతంలో ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే స్పందించి, శాసనసభ్యుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు ఎస్.పీ.ని బలంగా కోరారు. మహిళల భద్రత, గౌరవం కోసం ఈ అంశాన్ని సీరియస్గా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా జనరల్ సెక్రెటరీ గాయత్రీ దేవి, రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి చిరంజీవి, జిల్లా ఉపాధ్యక్షురాలు హరీష రెడ్డి, పుత్తూరు మున్సిపాలిటీ పట్టణ మహిళా అధ్యక్షురాలు, కౌన్సిలర్ జయలక్ష్మి, కౌన్సిలర్ భానుమతి చక్రి తదితర నియోజకవర్గ మహిళా నాయకులు పాల్గొన్నారు.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications