IT Hub: పండగ టైమ్ లో బంపర్ ఆఫర్, మాస్క్ లేకుంటే రూ. 250, దూరిదూరి మాట్లాడితే రూ. 250, దూలతీరింది !
బెంగళూరు: కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడానికి ఐటీ హబ్ బెంగళూరు సిటీలో కట్టుదిట్టమైన నియమాలు అమలు చెయ్యాలని అధికారులు నిర్ణయించారు. రెండు నెలల పాటు వరుసగా పండుగలు రావడంతో కరోనా వైరస్ మహమ్మారి తాండవం చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు, కర్ణాటకలో ఎంతో ఘనంగా నిర్వహించే వరమహాలక్ష్మి వ్రతం (వరలక్ష్మివ్రతం), మోహరం, శ్రీక్రిష్ణ జన్మాష్టమి, వినాయక చవితి, దుర్గాపూజా తదితర పండుగలు వరుసగా వస్తున్న నేపథ్యంలో కరోనా వైరస్ చాపకింద నీరుగా వ్యాపించే అవకాశం ఉందని నిపుణలు హెచ్చరించారు. బెంగళూరు నగరంతో సహ నిత్యం రద్దీగా ఉండే మార్కెట్ల నుంచి కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులోని మార్కెట్లు, రెస్టారెంట్లు, ,హోటల్స్, మాల్స్ తో పాటు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ వేసుకోకుంటే రూ. 250, భౌతిక దూరం పాటించకుంటే రూ. 250 అపరాదరుసుం వసూలు చెయ్యాలని బీబీఎంపీ అధికారులు నిర్ణయించారు. కోవిడ్ నియమాలు ఉల్లంఘించే వారి నుంచి అపరాద రుసుం వసూలు చెయ్యడానికి బెంగళూరులోని 8 విభాగాలలో బీబీఎంపీ అధికారులు ప్రత్యేకంగా మార్షల్స్ ను రంగంలోకి దింపారు.

ఐటీ హబ్ లో కరోనా దెబ్బతో హడల్
కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడానికి ఐటీ హబ్ బెంగళూరు సిటీలో కట్టుదిట్టమైన నియమాలు అమలు చెయ్యాలని అధికారులు నిర్ణయించారు. ఇటీవల కాలంలో బెంగళూరులోని అనేక ప్రాంతాల్లోని అపార్ట్ మెంట్ ఉన్న ఏరియాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని అధికారులు గుర్తించారు. బెంగళూరు నగరంలో కరోనా వైరస్ కట్టడికి బీబీఎంపీ అధికారులు, వైద్య శాఖ అధికారులు ఇప్పటికే అనేక కఠిన చర్యలు తీసుకున్నారు.

వరుసగా పండుగలు
రెండు నెలల పాటు వరుసగా పండుగలు రావడంతో కరోనా వైరస్ మహమ్మారి తాండవం చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు, కర్ణాటకలో ఎంతో ఘనంగా నిర్వహించే వరమహాలక్ష్మి వ్రతం (వరలక్ష్మివ్రతం), మోహరం, శ్రీక్రిష్ణ జన్మాష్టమి, వినాయక చవితి, దుర్గాపూజా తదితర పండుగలు వరుసగా వస్తున్న నేపథ్యంలో కరోనా వైరస్ చాపకింద నీరుగా వ్యాపించే అవకాశం ఉందని నిపుణలు హెచ్చరించారు.

బెంగళూరులో కరోనా హాట్ స్పాట్లు మార్కెట్లు
బెంగళూరు నగరంతో సహ నిత్యం రద్దీగా ఉండే సిటీ మార్కెట్, శివాజీనగర, మెజస్టిక్, అవెన్యూ రోడ్డు, ఎస్ పీ రోడ్డు, జేసీ రోడ్డు, కలాసిపాళ్య, బనశంకరి, జయనగర, యశవంతపురం, యలహంక తదితర మార్కెట్లతో పాటు రద్దీగా ఉండే ఇతర ప్రాంతాల నుంచి కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులోని మార్కెట్లు, రెస్టారెంట్లు, ,హోటల్స్, మాల్స్ లో కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు.

మాస్క్ లేకుంటే రూ. 250, దూరిదూరి మాట్లాడితే రూ. 250
బెంగళూరులోని మార్కెట్లు, రెస్టారెంట్లు, ,హోటల్స్, మాల్స్ తో పాటు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ వేసుకోకుంటే రూ. 250, భౌతిక దూరం పాటించకుంటే రూ. 250 అపరాదరుసుం వసూలు చెయ్యాలని బీబీఎంపీ అధికారులు నిర్ణయించారు. కోవిడ్ నియమాలు ఉల్లంఘించే వారి నుంచి అపరాద రుసుం వసూలు చెయ్యడానికి బెంగళూరులోని 8 విభాగాలలో బీబీఎంపీ అధికారులు ప్రత్యేకంగా మార్షల్స్ ను రంగంలోకి దింపారు. మొత్తం మీద బెంగళూరులో ఇక ముందు కోవిడ్ నియమాలు ఉల్లంఘించే వారి దూల తీరుపోవడం గ్యారెంటీ అంటున్నారు ప్రజలు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications