Lovers: ప్రియురాలికి పెళ్లి ఫిక్స్, కులం తక్కువవాడని సూటిపోటి మాటలు, విషయం తాగి ఒకేసారి ప్రేమికులు!
బెంగళూరు/ దావణగెరె: ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. మూడు సంవత్సరాల నుంచి ప్రేమించుకున్న యువతి, యువకుడు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే ఇద్దరి కులాలు వేరుకావడంతో వాళ్ల పెళ్లికి పెద్దలు నిరాకరించారు. పెళ్లి చేసుకుంటే మీకు పుట్టబోయే బిడ్డలకు పెళ్లి సంబంధాలు రావని, కులం తక్కువ వాడిని పెళ్లి చేసుకుంటే మేము తల ఎత్తుకుని తిరగలేమని కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు.
పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించలేమని ప్రేమికులు అనుకున్నారు. ఇదే సమయంలో అమ్మాయికి వేరే యువకుడితో పెళ్లి ఫిక్స్ అయ్యి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. వేర్వేరుగా కలిసి జీవించలేమని అనుకున్న ప్రేమికులు ఒకేచోట విషం సేవించి ఆత్మహత్యలు చేసుకోవడం కలకలం రేపింది.
చిన్నప్పటి ఫ్రెండ్స్
కర్ణాటకలోని దావణగెరె జిల్లాలోని నవలగుంద తాలుకాలోని తడవాడి గ్రామంలో సావిత్రి (21) అనే యువతి నివాసం ఉంటున్నది. అదే ప్రాంతంలో మల్లప్ప అలియాస్ మల్ల అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. సావిత్రి, మల్లప్ప చిన్నప్పటి నుంచి చిన్ననాటి స్నేహితులతో కలిసిమెలసి తిరుగుతూ ఉన్నారు.
పెళ్లి చేసుకోవాలని డిసైడ్
ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న సావిత్రి, మల్లప్ప ప్రేమించుకున్నారు. మూడు సంవత్సరాల నుంచి ప్రేమించుకున్న మల్లప్ప, సావిత్రి ఇదే సంవత్సరంలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే ఇద్దరి కులాలు వేరుకావడంతో ఎలాగైనా పెద్దలను పెళ్లికి ఒప్పించాలని ప్రేమికులు సావిత్రి, మల్లప్ప అనుకున్నారు.
పెళ్లికి నో చెప్పిన పెద్దలు
సావిత్రి, మల్లప్పల పెళ్లికి వాళ్ల పెద్దలు నిరాకరించారు. పెళ్లి చేసుకుంటే మీకు పుట్టబోయే బిడ్డలకు పెళ్లి సంబంధాలు రావని, కులం తక్కువ వాడిని పెళ్లి చేసుకుంటే మేము తల ఎత్తుకుని తిరగలేమని కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించలేమని ప్రేమికులు సావిత్రి, మల్లప్ప అనుకున్నారు.
విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ప్రేమికులు
ఇదే సమయంలో సావిత్రికి వేరే యువకుడితో పెళ్లి ఫిక్స్ అయ్యి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. వేర్వేరుగా కలిసి జీవించలేమని అనుకున్న ప్రేమికులు సావిత్రి, మల్లప్ప ఒకేచోట విషం సేవించారు. విషయం గుర్తించిన బంధువులు సావిత్రి, మల్లప్పను దావణగెరెలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై మొదల సావిత్రి చనిపోయింది. సావిత్రి చనిపోయిన 10 గంటల తరువాత మల్లప్పకూడా చనిపోయాడని పోలీసులు అన్నారు. పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ప్రేమికులు విషం తాగి ఆత్మహత్యలు చేసుకోవడం కలకలం రేపింది.