Doctor: జ్వరంకు ఇంజక్షన్ వేస్తే సెప్టిక్ అయ్యిందని ఆపరేషన్, బెంగళూరు ఇద్దరు డాక్టర్ల దెబ్బతో ?
జ్వరంతో ఆస్పత్రికి వెళ్లిన యువకుడికి ఇంజక్షన్ ఇచ్చిన క్లీనిక్ డాక్టర్ అతని శరీరాన్ని సెప్టిక్ చేశాడు. సెప్టిక్ నుంచి ప్రాణాలు రక్షించుకోవడానికి ఆ యువకుడు ఆపరేషన్ చేసుకుంటే ప్రాణం పోయింది.
బెంగళూరు: జ్వరంతో ఆస్పత్రికి వెళ్లిన యువకుడికి ఇంజక్షన్ ఇచ్చిన క్లీనిక్ డాక్టర్ అతని శరీరాన్ని సెప్టిక్ చేశాడు. సెప్టిక్ నుంచి ప్రాణాలు రక్షించుకోవడానికి ఆ యువకుడు ఆపరేషన్ చేసుకున్నాడు. ఆపరేషన్ జరిగే సమయంలో తీవ్రరక్తస్రావంతో ఆ వ్యక్తి మృతి చెందిన ఘటన బెంగళూరులో కలకలం రేపింది.
సాధారణంగా ప్రతి ఒక్కరికి జ్వరం, దగ్గు, జలుబుతో చిన్న చిన్న జబ్బులు వస్తాయి. ఇలాగే జ్వరంతో ఓ యువకుడు ఓ క్లీనిక్ కు వెళ్లి అతని ప్రాణం పోగొట్టుకున్నాడు.

చిన్నిచిన్న ఆసుపత్రులు, ముక్కుముఖం తెలియన డాక్టర్ల దగ్గరకు వెళ్లి ఇంజక్షన్, మాత్రలు తీసుకుని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. బెంగళూరులోని రామమూర్తి నగర్కు చెందిన విజేత (24) అనే యువకుడు కూడా జ్వరం వచ్చిందని చెప్పి సమీపంలోని క్లినిక్కి వెళ్లాడు. ఆ క్లీనిక్ వైద్యులు విజేతకు జ్వరం తగ్గిపోవాలని ఓ ఇంజక్షన్ వేశాడు. అయితే ఈ ఇంజక్షన్ ఇవ్వడంతో యువకుడికి రక్తం గడ్డకట్టింది. దీంతో వైద్యం చేయించుకునేందుకు ప్రయివేటు ఆసుపత్రికి వెళ్తే ఆపరేషన్ చేయాల్సి ఉందని, లేదంటే ఇప్పటికే సెప్టిక్ కావడంతో ప్రాణాల మీదకు వస్తుందని చెప్పారు.
క్లినిక్ లో వేసుకున్న ఇంజక్షన్ సెప్టిక్గా మారడంతో రామమూర్తినగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో విజేతను అతని కుటుంబ సభ్కులు చేర్పించారు. జ్వరంతో అక్కడికి వెళ్లిన యువకుడికి ఆపరేషన్ చేయాల్సిందే అని వైద్యులు తేల్చి చెప్పారు. అయితే ముందుగా యువకుడికి అవసరమైన రక్తాన్ని సేకరించకుండానే ఆసుపత్రి సిబ్బంది ఆపరేషన్ కు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని సమాచారం. ఆపరేషన్ సమయంలో తీవ్ర రక్తస్రావం జరిగింది. ఈ సందర్భంలో, మీరు ఎక్కడి నుండైనా వెళ్లి విజేత బ్లడ్ గ్రూప్ రక్తం తీసుకురావాలని చివరి నిమిషయంలో యువకుడి కుటుంబ సభ్యులకు హడావిడిగా చెప్పారు. అయితే రక్తం వచ్చేలోపే ఆపరేషన్ చేసుకున్న విజేత మృతి చెందాడు.
రక్తాన్ని సేకరించకుండానే యువకుడికి ఆపరేషన్ చేసిన ఆసుపత్రి యాజమాన్యంపై మృతుడి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని అద్దాలు, ఇతర సామాగ్రిని ధ్వంసం చేశారు. అయితే తమ తప్పును అంగీకరించకుండా రక్తాన్ని తీసుకురావడంలో కుటుంబ సభ్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆసుపత్రి సిబ్బంది ఆరోపిస్తున్నారు. జ్వరం వచ్చిందని ఆసుపత్రికి వెళ్లిన ఓ యువకుడికి సెప్టిక్ కావడం, తరువాత ఆపరేషన్ చెయ్యడంతో చివరికి అతని ప్రాణం పోయింది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications