వైద్యులకు షాక్: కోడిలానే 20గుడ్లు పెట్టిన బాలుడు, మూడేళ్లుగా అదే పనిగా..!
జకార్తా: ప్రపంచంలో కోళ్లు, ఇతర పక్షులు, కొన్ని జంతువులు మాత్రమే గుడ్లు పెడతాయని మనకు తెలుసు. కానీ, మనుషులు గుడ్లు పెట్టడం వింతే కాదా. ఇలాంటి వింత ఘటన ఇండియోనేషియాలో చోటు చేసుకుంది.
ఇండోనేషియాకు చెందిన అక్మల్ అనే 14ఏళ్ల బాలుడు కోడి గుడ్ల లాంటి గుడ్లు పెడుతున్నాడు. గత మూడేళ్ల నుంచి అక్మల్ ఇలా గుడ్లు పెడుతున్నాడని అతడి తండ్రి చెబుతున్నారు.
మూడేళ్లుగా..
అక్మల్ ఈ మూడేళ్ల(2015నుంచి) కాలంలో ఇప్పటి వరకు 20 గుడ్లు పెట్టాడని అక్మల్ తండ్రి తెలిపాడు. ఈ విచిత్రమైన వ్యవహారంపై వైద్యులను సంప్రదించినా ఫలితం లేకుండా పోయిందని వాపోయాడు.
ఖంగుతిన్న వైద్యులు
మొదట ఇదంతా నమ్మని వైద్యులు.. వారి ముందే అక్మల్ రెండు గుడ్లు పెట్టడంతో ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఆ తర్వాత అక్మల్కు వైద్యులు అన్ని వైద్య పరీక్షలు చేశారు. అయితే, సమస్య ఎంటో మాత్రం వారికి అర్థం కాలేదు.
అసాధ్యమే కానీ..
కాగా, మనిషి గుడ్లు పెట్టడం అసాధ్యమని వైద్యులు చెబుతున్నారు. అక్మల్ అంతకుముదు గుడ్లు మింగేసి ఉంటాడని, అవే బయటకు వస్తున్నాయని కావొచ్చని వైద్యులు చెబుతున్నారు.
తెల్ల, పసుపు రంగులో గుడ్లు
అయితే, తండ్రి మాత్రం తన కొడుకు ఏ గుడ్లు మింగలేదని చెబుతున్నాడు. ఒకటి లేదా రెండు నెలలకోసారి అక్మల్ ఓ గుడ్డు పెడుతున్నాడని తెలిపాడు. తన కొడుకు పెట్టిన గుడ్లు పూర్తిగా తెల్లగా గానీ, పసుపు రంగులో గానీ ఉంటున్నాయని చెబుతున్నాడు. వైద్యులే దీనికి ఏదైనా పరిష్కారం చూపాలని కోరుతున్నాడు.