సుందర్ పిచాయ్ కు మైండ్ బ్లాక్ శాలరీ ప్యాకేజ్ ఆఫర్
ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ మరోసారి వార్తల్లోకెక్కారు. ఆయన జీతం భారీగా పెరిగింది. కళ్లు చెదిరే శాలరీని అందుకోనున్నాడు. రాబోయే మూడేళ్లలో సుమారు 6,200 కోట్ల రూపాయల భారీ ప్యాకేజీని అందుకోనున్నాడు. దీని విలువ 692 మిలియన్ డాలర్లు. సవరించిన ఈక్విటీ ప్లాన్ ప్రకారం.. ఆయనకు ఈ మొత్తం అందబోతోంది. ఈ ప్యాకేజీలోని ఒక ముఖ్యమైన భాగం ఆల్ఫాబెట్ కు చెందిన అత్యంత కీలకమైన ప్రాజెక్టులు వేమో (Waymo), వింగ్ (Wing) పనితీరుతో ముడిపడి ఉంది.
శుక్రవారం యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC)కి సమర్పించిన ఫైలింగ్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ ప్లాన్ ద్వారా పిచాయ్ ఆదాయంలో ఎక్కువ భాగం ఆల్ఫాబెట్ కొత్త వ్యాపారాల వృద్ధిపై ఆధారపడనుందని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఈ పరిహార ప్యాకేజీ మూడు సంవత్సరాల సైకిల్ను కవర్ చేస్తుంది. ఇందులో అనేక ఈక్విటీ భాగాలు ఉన్నాయి. 2022లో పిచాయ్కు మంజూరు చేసిన ప్యాకేజీ కంటే అదనం. కొన్ని కొత్త ప్రోత్సాహకాలు చేరాయి ఇందులో.

సెల్ప్ డ్రైవింగ్ టెక్నాలజీ కంపెనీ వేమో, డ్రోన్ డెలివరీ సర్వీస్ వింగ్కు సంబంధించిన ఇన్సెంటివ్లు తాజా ప్యాకేజీలో భాగం అయ్యాయి. కొత్త శాలరీ స్ట్రక్చర్ లో కొంత భాగం వేమో అంచనా వేసిన ఫైనాన్షియల్ బ్యాలెన్స్ షీట్ తో ముడిపడి ఉంది. అంటే- మూడేళ్ల కాలంలో ఈ కంపెనీ ఈక్విటీ యూనిట్ల విలువ పెరిగితే 260 మిలియన్ డాలర్ల వరకు స్టాక్ ఇన్సెంటివ్లను పొందే అవకాశం సుందర్ పిచాయ్ కు లభిస్తుంది. ఈ చెల్లింపును నిర్ణయించడానికి ఉపయోగించే అసెస్ మెంట్ ను ఆల్ఫాబెట్ కమిటీ నిర్ణయిస్తుంది.
ప్యాకేజీలో మరో భాగం- కంపెనీ డ్రోన్ డెలివరీ వ్యాపారమైన వింగ్. దీనికి సంబంధించిన ఈక్విటీ యూనిట్లను సుందర్ పిచాయ్కు మంజూరు చేశారు. రాబోయే మూడేళ్లలో కంపెనీ విలువ పెరిగినట్లయితే ఈ యూనిట్ల విలువ 90 మిలియన్ డాలర్ల వరకు చేరుకోవచ్చు. ఆల్ఫాబెట్ బోర్డు ఈ వెంచర్లతో సీఈఓ ప్యాకేజీలో కొంత భాగాన్ని అనుసంధానించడానికి గల కారణాన్ని ఫైలింగ్లో పొందుపరిచింది.
2026లో వేమో తన వాణిజ్య సేవలను డల్లాస్, హ్యూస్టన్, శాన్ ఆంటోనియో, ఓర్లాండో వంటి నగరాలకు కూడా విస్తరించింది. 2012లో వింగ్ ను ఆల్ఫాబెట్ ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఆ తర్వాత 2018లో స్వతంత్ర అనుబంధ సంస్థగా మారింది. చిన్న ప్యాకేజీలను నేరుగా వినియోగదారులకు రవాణా చేయడానికి రూపొందించిన డ్రోన్ ఆధారిత డెలివరీ సేవలను వింగ్ నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో తన డెలివరీ నెట్వర్క్ను విస్తరించే ప్రణాళికలో భాగంగా 2027 నాటికి 300 స్టోర్లకు తన కార్యకలాపాలను విస్తరించనుంది.
-
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
అతడు ఇప్పుడు పక్కా మెంటల్లీ టఫ్: రవిశాస్త్రి -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
భారత్ కు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్.. -
ఫైనల్ వేళ టీమిండియాకు మాజీ కోచ్ హెచ్చరిక, అభిషేక్ బ్యాటింగ్ ఆర్డర్ ఇక..!! -
మీ పాత బంగారం చెల్లుతుందా? 2026 కొత్త నిబంధనలు ఇవే! -
EPF 2026 అమల్లోకి: డబ్బులు ఎన్నిసార్లు తీసుకోవచ్చో తెలుసా? -
T20 world cup Final: ఫైనల్ అభిషేక్ దే-తేల్చేసిన టీమిండియా హీరో..! -
ఇరాన్ పోరాటం వెనుక రహస్య ఆయుధం? యూఎస్-ఇజ్రాయెల్ కు చిక్కని సీక్రెట్..! -
జీహెచ్ఎంసీ వాసులకు బిగ్ న్యూస్.. వారి ఆస్తులు సీజ్ కు రంగం సిద్ధం! -
ఆ ఉద్యోగుల జీతాలు నిలిపివేత, ఐఏఎస్ ల నుంచి జిల్లా స్థాయి వరకు - నిర్ణయం వెనుక..!!












Click it and Unblock the Notifications