Bank Holidays: వరుసగా 4 రోజులు బ్యాంకు కార్యకలాపాలకు అంతరాయం
ప్రశాంతంగా ఉండే బ్యాంక్ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. చాలా రోజుల తర్వాత బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు దిగబోతున్నారు. దీంతో బ్యాంకింగ్ కార్యకలాపాలు నిలిచిపోబోతున్నాయి. జనవరిలో వరుసగా 4 రోజులు బ్యాంకు కార్యకలాపాలకు అంతరాయం కలగనున్నట్లు తెలుస్తోంది. బ్యాంక్ ఉద్యోగులు ఎందుకు సమ్మెకు దిగబోతున్నారు. వారి సమస్యలేంటి. ఏఏ తేదీల్లో బ్యాంకులు పని చేయవో ఇక్కడ తెలుసుకుందాం.
బ్యాంక్ ఉద్యోగులు మళ్లీ సమ్మె బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. తమ చిరకాల డిమాండ్లపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా 2026 జనవరి 27న దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC) ప్రకటించింది. ఈ మేరకు సర్క్యులర్ విడుదల చేస్తూ, సమస్యలపై కేంద్రం ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఐదు రోజుల పని విధానం..
బ్యాంక్ ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయిన వారానికి ఐదు రోజుల పని విధానంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని AIBOC ఆరోపించింది. అంతేకాకుండా, వేతన సవరణ అంశం కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయిందని పేర్కొంది. గతంలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA), యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్లు (UFBU) ఐదు రోజుల పనిపై ఏకాభిప్రాయానికి వచ్చినా, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదని తెలిపింది. ఈ నిర్లక్ష్యానికే నిరసనగా సమ్మెకు పిలుపునిచ్చామని వివరించింది.

పూర్తిగా నిలిచిపోనున్న సేవలు..
సమ్మె కారణంగా జనవరి 27న బ్యాంకింగ్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశముంది. అన్ని బ్యాంకుల ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటే, బ్రాంచ్ కార్యకలాపాలు పూర్తిగా నిలిచే పరిస్థితి ఉంటుంది. అయితే ఏటీఎంలు, క్యాష్ డిపాజిట్ మెషీన్లు, ఆన్లైన్ లావాదేవీలు కొనసాగవచ్చని సమాచారం. అయినా వినియోగదారులు ముందుగానే అవసరమైన పనులు పూర్తి చేసుకోవాలని బ్యాంకింగ్ వర్గాలు సూచిస్తున్నాయి.
27 నుంచి..
ఇక్కడ మరో కీలక అంశం ఏమిటంటే.. వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు మూతపడే పరిస్థితి. జనవరి 24న నాలుగో శనివారం, 25న ఆదివారం సెలవు, 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా హాలిడే ఉంది. ఈ నేపథ్యంలో 27న సమ్మె జరిగితే, వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోవచ్చు.
వీకెండ్ హాలిడే..
బ్యాంకర్లు తమ డిమాండ్కు న్యాయబద్ధత ఉందని స్పష్టం చేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, LIC, GIC, ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్, స్టాక్ మార్కెట్లు, ఇతర కేంద్ర ప్రభుత్వ విభాగాలన్నీ ఇప్పటికే వారానికి ఐదు రోజులే పని చేస్తున్నాయని గుర్తు చేస్తున్నారు. బ్యాంకులకు ప్రస్తుతం ఆదివారాలు, నెలలో రెండో మరియు నాలుగో శనివారాలే సెలవులు ఉండగా, మిగతా శనివారాలను కూడా హాలిడేగా ప్రకటించాలని కోరుతున్నారు.
సానుకూల సంకేతాలపై...
ఇక ప్రపంచ దేశాల్లో చాలాచోట్ల వారానికి నాలుగు రోజుల పని విధానం అమలులో ఉండగా, తాము కేవలం ఐదు రోజుల పనే కోరుకుంటున్నామని ఉద్యోగులు చెబుతున్నారు. డిజిటల్ సేవలు 24x7 అందుబాటులో ఉన్నాయని, అదనపు సెలవులు విలాసం కోసం కాదని, న్యాయం కోసమే పోరాటం చేస్తున్నామని బ్యాంక్ ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. గతంలో 2024లో ప్రభుత్వ సానుకూల సంకేతాలపై వార్తలు వచ్చినా, ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేకపోవడం నిరాశ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాయి.
ఇకనైనా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని, మరిన్ని వాయిదాలు వద్దని బ్యాంక్ ఉద్యోగులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ సమ్మెపై కేంద్రం ఎలా స్పందిస్తుందోనన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications