Forbes 2025: భారత టాప్ 10 సంపన్నులు వీరే..!
Forbes 2025: ఇండియాలోని అత్యంత సంపన్న వ్యక్తుల జాబితాలో ముకేశ్ అంబానీ తన ఆధిపత్యాన్ని కొనసాగించారు. ఫోర్బ్స్ ఇండియా 2025లో విడుదల చేసిన 100 మంది సంపన్నుల జాబితాలో ముకేశ్ అంబానీ నికర విలువలో 12 శాతం తగ్గుదల ఉన్నప్పటికీ.. 105 బిలియన్ డాలర్ల సంపదతో దేశంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఆయన సంపద 100 బిలియన్ డాలర్లకు పైగా ఉండటంతో.. జాబితాలో ఏకైక 'సెంటిబిలియనీర్'గా నిలిచారు.
మొత్తంగా, ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. 2025లో ఇండియాలోని 100 మంది సంపన్నుల మొత్తం సంపద 9శాతం మేర, అంటే 100 బిలియన్ డాలర్లు తగ్గి, మొత్తం 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ జాబితాలో స్థానం పొందడానికి అవసరమైన కటాఫ్ విలువ కూడా 2024లో 3.3 బిలియన్ డాలర్ల నుంచి 3.2 బిలియన్ డాలర్లకు స్వల్పంగా తగ్గింది.

ఇండియాలోని టాప్ 10 సంపన్నుల వివరాలు
1.ముకేశ్ అంబానీ- 105 బిలియన్ డాలర్లు-సంపదలో 12 శాతం తగ్గుదల ఉన్నా అగ్రస్థానం నిలబెట్టుకున్నారు.
2.గౌతమ్ అదానీ అండ్ ఫ్యామిలీ-92 బిలియన్ డాలర్లు-గత సంవత్సరం కంటే స్వల్పంగా వెనుకబడి రెండో స్థానంలో ఉన్నారు.
3.సావిత్రి జిందాల్ అండ్ ఫ్యామిలీ (ఓ.పి. జిందాల్ గ్రూప్)- 40.2 బిలియన్ డాలర్లు-3.5 డాలర్ల బిలియన్లు సంపద తగ్గినా భారతదేశంలో అత్యంత ధనిక మహిళగా కొనసాగుతున్నారు.
4.సునీల్ మిట్టల్ అండ్ ఫ్యామిలీ (భారతీ ఎయిర్టెల్)-34.2 బిలియన్ డాలర్లు-మూడు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానానికి వచ్చారు. ఈ సంవత్సరం అత్యధికంగా 3.5 బిలియన్ డాలర్లు సంపాదించారు.
5.శివ్ నాడార్ (హెచ్సిఎల్ టెక్నాలజీస్)- 33.2 బిలియన్ డాలర్లు- గత సంవత్సరం నుంచి ఒక స్థానం దిగజారారు.
6.రాధాకిషన్ దమానీ అండ్ ఫ్యామిలీ(డీమార్ట్)- 28.2 బిలియన్ డాలర్లు- రిటైల్ చైన్ డీమార్ట్ను నియంత్రిస్తున్నారు.
7.దిలీప్ సంఘ్వీ అండ్ ఫ్యామిలీ (సన్ ఫార్మాస్యూటికల్స్)-26.3 బిలియన్ డాలర్లు- ఫార్మా రంగంలో కీలక వ్యక్తి.
8. బజాజ్ కుటుంబం- 21.8 బిలియన్ డాలర్లు- ఫైనాన్స్, ఇన్సూరెన్స్, ఆటోమొబైల్స్లో విస్తృత వ్యాపారాలు.
9. సైరస్ పూనావాలా (సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా)-21.4 బిలియన్ డాలర్లు-ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ అధినేత.
10. కుమార్ బిర్లా (ఆదిత్య బిర్లా గ్రూప్)- 20.7 బిలియన్ డాలర్లు- పారిశ్రామికవేత్త.
11.హిందూజా కుటుంబం- 20.6 బిలియన్ డాలర్లు-టాప్ 10 తర్వాత వెంటనే 11వ స్థానంలో ఉన్నారు.
కొత్తగా జాబితాలో చేరిన వారు, తిరిగి వచ్చిన వారు
ఈ ఏడాది జాబితాలో పలువురు కొత్తవారు, తిరిగి చేరిన వారు ఉన్నారు.
దోషి బ్రదర్స్: 7.5 బిలియన్ డాలర్ల నికర సంపదతో 37వ స్థానంలో అడుగుపెట్టారు. వీరి కంపెనీ వారి ఎనర్జీస్ భారతదేశంలో అతిపెద్ద సోలార్ ప్యానెల్ తయారీదారుగా ఉంది.
సునీల్ వచాని: (80వ స్థానం, $3.85 బిలియన్లు). డిక్సన్ టెక్నాలజీస్ వ్యవస్థాపకులు, శాంసంగ్, షియోమి వంటి బ్రాండ్లకు ఎలక్ట్రానిక్ వస్తువులను తయారు చేస్తారు.
తిరిగి జాబితాలో చేరిన వారిలో యూఎస్వీకి చెందిన లీనా తెవారీ (82వ స్థానం, $3.8 బిలియన్లు), శోభ సంస్థకు చెందిన పి.ఎన్.సి. మేనన్ (87వ స్థానం, $3.6 బిలియన్లు), కేపిఆర్ మిల్లుకు చెందిన కె.పి. రామసామి (97వ స్థానం, $3.3 బిలియన్లు) ఉన్నారు. అయితే గత సంవత్సరం జాబితాలో ఉన్న ఏడుగురు ఈసారి బయటపడ్డారు. మొత్తంగా భారతీయ సంపన్నులకు ఈ సంవత్సరం నికర సంపద పరంగా కొంత సవాలుగా ఉన్నప్పటికీ.. సాంకేతికత, పునరుత్పాదక ఇంధన రంగాల నుండి కొత్త ఆటగాళ్లు జాబితాలోకి ప్రవేశించడం మార్కెట్ విస్తరణను సూచిస్తోంది.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications